PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. “దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత” అనే నినాదంతో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ప్రధాని సూచించిన కీలక సూచనలు ఇవే..
ఏడాది పాటు బంగారం కొనవద్దు:
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో, కనీసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని సూచించారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
Also Read
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
- Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి:
ముడి చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ రక్షణ కోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి:
కాలుష్య రహిత భారతం కోసం సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని పెంచాలని, పర్యావరణ హితమైన రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్:
ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు.. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అనుసరించాలని, సమావేశాలను ఆన్లైన్ వేదికల ద్వారా నిర్వహించుకోవాలని తెలిపారు.
విదేశీ పర్యటనలు తగ్గించాలి:
దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశాలకు తరలిపోయే ధనాన్ని అరికట్టడానికి విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని సూచించారు.
వంట నూనెల వినియోగం:
ఆరోగ్యపరంగా, దిగుమతి భారం తగ్గించే ఉద్దేశంతో వంట నూనెల వినియోగంలో పొదుపు పాటించాలని కోరారు.
రసాయనిక ఎరువుల వాడకం:
నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు.
సోలార్ పంపులు:
వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లను వినియోగించాలని, తద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలని సూచించారు.
స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత:
స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలను, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని.. ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని కోరారు.
ఆడంబరాలు తగ్గించాలి:
మధ్య తరగతి కుటుంబాలు అనవసరపు ఖర్చులను, ఆడంబరాలను తగ్గించుకుని పొదుపు వైపు మొగ్గు చూపడం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు.
తాజావార్తలు
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
-
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
-
Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
-
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!