PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. “దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత” అనే నినాదంతో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ప్రధాని సూచించిన కీలక సూచనలు ఇవే..
ఏడాది పాటు బంగారం కొనవద్దు:
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో, కనీసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని సూచించారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
Also Read
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి:
ముడి చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ రక్షణ కోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి:
కాలుష్య రహిత భారతం కోసం సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని పెంచాలని, పర్యావరణ హితమైన రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్:
ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు.. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అనుసరించాలని, సమావేశాలను ఆన్లైన్ వేదికల ద్వారా నిర్వహించుకోవాలని తెలిపారు.
విదేశీ పర్యటనలు తగ్గించాలి:
దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశాలకు తరలిపోయే ధనాన్ని అరికట్టడానికి విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని సూచించారు.
వంట నూనెల వినియోగం:
ఆరోగ్యపరంగా, దిగుమతి భారం తగ్గించే ఉద్దేశంతో వంట నూనెల వినియోగంలో పొదుపు పాటించాలని కోరారు.
రసాయనిక ఎరువుల వాడకం:
నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు.
సోలార్ పంపులు:
వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లను వినియోగించాలని, తద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలని సూచించారు.
స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత:
స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలను, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని.. ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని కోరారు.
ఆడంబరాలు తగ్గించాలి:
మధ్య తరగతి కుటుంబాలు అనవసరపు ఖర్చులను, ఆడంబరాలను తగ్గించుకుని పొదుపు వైపు మొగ్గు చూపడం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు.
తాజావార్తలు
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
-
Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
-
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్ను సున్నాకే పెవిలియన్కు పంపిన బౌలర్లు వీరే!
-
Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
ట్రెండింగ్
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత