PM Convoy: కాన్వాయ్ ఆపి.. అంబులెన్స్కు దారిచ్చిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Convoy: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయన వెళ్తున్న మార్గంలో అంబులెన్స్ ను దారి ఇవ్వడం కోసం తన కాన్వాయిని కాసేపు నిలివేశారు. మోదీ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ తన కాన్వాయ్ను దాటిన తర్వాతే మోదీ తన కాన్వాయ్ను ముందుకు కదిలించారు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ బీజేపీ మీడియా విభాగం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్-గాంధీనగర్ మార్గంలో ప్రధాని కాన్వాయ్లోని ఎస్యూవీలు నెమ్మదిగా ఎడమవైపునకు వెళ్లి అంబులెన్స్కు దారి ఇస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని దూరదర్శన్ కేంద్రం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం గాంధీనగర్లోని రాజ్భవన్కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ తొలి దశతో పాటు గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ రోజు సాయంత్రం బనస్కాంత జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే, అక్కడ ప్రముఖ అంబాజీ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ హైస్పీడ్ రైలును మోదీ ప్రారంభించారు. అనంతరం కాసేపు అందులో ప్రధాని ప్రయాణించారు. రైలులో ఏర్పాట్లను పరిశీలించారు. ఇక, ఈ రైలు అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు నడవనుంది. ఈ మార్గంలో టికెట్ కనిష్ఠ ధర రూ.1385, గరిష్ఠ ధర రూ. 2505గా ఉంది. కాగా.. దేశంలో ఇది మూడో వందే భారత్ రైలు. 2019లో తొలి వందే భారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ – వారణాసి మార్గంలో హైస్పీడ్ రైలు ప్రారంభించగా.. న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!