Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!

Delhi

Delhi

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర క్యాబినెట్ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు.

×
×
Ad