Parliament Sessions: “జీ20 సమ్మిట్.. భారత సామర్థ్యాలను ప్రదర్శించేందుకు సువర్ణావకాశం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గతంలో అనేక బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారని ఆయన అన్నారు. పార్లమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, సూపర్ స్టార్ కృష్ణకు సభ్యులు నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ రాజ్యసభ అధ్యక్షుడిగా మొదటి రోజు సభ నడపబోతున్నారని.. ఆయనకు ప్రధాని అభినందనలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. దేశ గౌరవాన్ని పెంచేలా సభలో చర్చలు జరగాలన్నారు.
శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం రావటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందు సమావేశమయ్యామని, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జీ-20కి అధ్యక్షత వహించే గొప్ప అవకాశం వచ్చిందని ప్రధాని వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదన్న మోడీ.. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశమని తెలిపారు. ప్రపంచానికి భారత్ అంటే ఏంటో సామర్థ్యాన్ని తెలుసుకునే సమయమన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయ తీసుకునేందుకు కృషి చేయాలని… అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నానన్నారు.
MCD Polls Results: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ, ఆప్ హోరాహోరీ
“పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం. పార్లమెంట్ సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలి. పార్లమెంట్లో యువ సభ్యులకు చర్చలకు అవకాశం ఇవ్వాలి. కేంద్రం ప్రతి అంశంపై చర్చ జరగాలని కోరుకుంటుంది. అన్ని పార్టీల నేతలు చర్చలకు సహకరించాలి..సమగ్ర చర్చ జరగకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. సభ్యులంతా పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలి.” అని ప్రధాని మోడీ కోరుకున్నారు.
This Parliament session is being held at a time when we are marking Azadi Ka Amrit Mahotsav and when India has assumed the G-20 Presidency: Prime Minister Narendra Modi in the Rajya Sabha pic.twitter.com/OfxiVBS68t
— ANI (@ANI) December 7, 2022
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!