LIC Share Price: ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్న ప్రధాని.. భారీ నష్టంలో ఎల్ఎఐసీ షేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC Share Price: లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రతిస్పందిస్తూ ఎల్ఐసీపై ప్రశ్నలను లేవనెత్తినందుకు ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీపై గందరగోళం నెలకొందన్నారు. అయితే నేడు ఎల్ఐసి నిరంతరం బలపడుతోంది. కానీ వాస్తవమేమిటంటే.. మే 2022లో ఎల్ఐసి ఐపిఓలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఇప్పటికీ భారీ నష్టాల్లోనే ఉన్నారు. ఎల్ఐసీని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ముందుకు రావాలని ప్రధాని మోడీ కోరారు. కానీ నిజానికి అయితే ఎల్ఐసీ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ల అనుభవం గత 15 నెలల్లో బాగా లేదు.
Read Also:Malavika Mohan : అబ్బా.. నాజుకు అందాలతో పరేషాన్ చెయ్యకు పాప..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఎల్ఐసీ ఐపీవో స్టాక్ ఎక్స్ఛేంజ్ 17 మే 2022న జరిగింది. లిస్టింగ్ రోజు నుండి సదరు కంపెనీ ఐపీవోలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఎల్ఐసీ ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.949 చొప్పున డబ్బు సమీకరించింది. ఆ స్థాయి నుండి స్టాక్ దాదాపు రూ. 300 తగ్గి రూ.659 వద్ద ట్రేడవుతోంది. అంటే, స్టాక్ ఇప్పటికీ ఇష్యూ ధర కంటే 30 శాతం దిగువన ట్రేడవుతోంది. ఒక్కో షేరుకు ఐపీఓ ధర రూ.949 ప్రకారం ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,00,242 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం రూ.4.17 లక్షల కోట్లకు తగ్గింది. అంటే, లిస్టింగ్ తర్వాత ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.1.83 లక్షల కోట్లు తగ్గింది. ఎల్ఐసి లిస్టింగ్పై ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా పెట్టుబడిపై మంచి రాబడులు లభిస్తాయని చైర్మన్ ఎంఆర్ కుమార్ హామీ ఇచ్చారు. 1956 నుండి కంపెనీ నిరంతరం ప్రభుత్వానికి డివిడెండ్లను చెల్లిస్తోంది.
Read Also:DGP Anjani Kumar : గోల్కొండలో స్వతంత్ర దినోత్స ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ అంజనీ కుమార్
కానీ ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవి చూశారు. ఈ కాలంలో స్టాక్ మార్కెట్లో గొప్ప బూమ్ కారణంగా చాలా స్టాక్లు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చాయి. అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక కూడా ఎల్ఐసికి సంబంధించి ఇన్వెస్టర్ల మూడ్ను పాడు చేసింది. ఎందుకంటే అదానీ గ్రూప్ స్టాక్స్లో ఎల్ఐసి భారీగా పెట్టుబడులు పెట్టింది. నివేదిక రాకముందు ఎల్ఐసీ పెట్టుబడి విలువ రూ.82,000 కోట్లు కాగా, అది రూ.31,000 కోట్లకు తగ్గింది. జనవరి-మార్చి త్రైమాసికంలో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలలో ఎల్ఐసి తన వాటాను పెంచుకుంది. ఇంత జరిగినా ఎల్ఐసీ ఇన్వెస్టర్లు ఈ షేరు ఇష్యూ ధరను అధిగమించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!