PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.3000 పెంపు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Samman Nidhi: దేశంలోని రైతులకు త్వరలో గొప్ప శుభవార్తను వినే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 అందజేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతు కుటుంబాలకు ఇచ్చే రూ.6000ను దాదాపు 50 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఈ అమౌంట్ రూ.2000 నుంచి రూ.3000వరకు పెరగవచ్చని సమాచారం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయాలని కూడా ఆలోచిస్తోందని, దీని కింద గ్రామీణ ఆదాయం తగ్గకుండా ఉండేందుకు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పీ కింద రైతుల నుంచి కొనుగోలును పెంచాలని ఆలోచిస్తోంది.
Read Also:Asia Cup 2023: అభిమానులకు శుభవార్త.. ఉచితంగానే ఆసియా కప్ మ్యాచ్లు చూడొచ్చు!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయం ముందు ఉంచినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఏటా రూ.20,000-30,000 కోట్ల వ్యయం ప్రభుత్వం ముందు పెరుగుతుందని అధికారి తెలిపారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది ఇంకా ఖరారు కానప్పటికీ.. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ మొత్తం రాష్ట్ర దేశీయ ఉత్పత్తికి వ్యవసాయం సహకారం 40 శాతం కాగా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఇది దాదాపు 27శాతం. నవంబర్-డిసెంబర్ నాటికి తగినంత వ్యవసాయ జనాభా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సహాయాన్ని పెంచినట్లయితే, ఈ రాష్ట్రాల రైతులు లాభపడవచ్చు. దీని కారణంగా ఎన్నికల్లో కూడా లాభం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also:BitCoin: ఎలోన్ మస్క్ దెబ్బకి.. బిచ్చగాళ్లుగా మారిన బిట్ కాయిన్ ఇన్వెస్టర్లు
పిఎం కిసాన్ యోజన కింద రైతు కుటుంబాలకు నగదు బదిలీ ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. దీనితో 85 మిలియన్లకు పైగా (సుమారు 8.5 కోట్లు) కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది. మహమ్మారి సమయంలో అధిక సంఖ్యలో కుటుంబాలు ఈ పథకం నుండి ప్రయోజనం పొందాయి. అయితే ఆదాయ ప్రొఫైల్, భూమి హోల్డింగ్ ఆధారంగా మినహాయింపు ప్రమాణాలు సంఖ్యను తగ్గించాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!