PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.3000 పెంపు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Samman Nidhi: దేశంలోని రైతులకు త్వరలో గొప్ప శుభవార్తను వినే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 అందజేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతు కుటుంబాలకు ఇచ్చే రూ.6000ను దాదాపు 50 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఈ అమౌంట్ రూ.2000 నుంచి రూ.3000వరకు పెరగవచ్చని సమాచారం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయాలని కూడా ఆలోచిస్తోందని, దీని కింద గ్రామీణ ఆదాయం తగ్గకుండా ఉండేందుకు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పీ కింద రైతుల నుంచి కొనుగోలును పెంచాలని ఆలోచిస్తోంది.
Read Also:Asia Cup 2023: అభిమానులకు శుభవార్త.. ఉచితంగానే ఆసియా కప్ మ్యాచ్లు చూడొచ్చు!
Also Read
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయం ముందు ఉంచినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఏటా రూ.20,000-30,000 కోట్ల వ్యయం ప్రభుత్వం ముందు పెరుగుతుందని అధికారి తెలిపారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది ఇంకా ఖరారు కానప్పటికీ.. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ మొత్తం రాష్ట్ర దేశీయ ఉత్పత్తికి వ్యవసాయం సహకారం 40 శాతం కాగా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఇది దాదాపు 27శాతం. నవంబర్-డిసెంబర్ నాటికి తగినంత వ్యవసాయ జనాభా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సహాయాన్ని పెంచినట్లయితే, ఈ రాష్ట్రాల రైతులు లాభపడవచ్చు. దీని కారణంగా ఎన్నికల్లో కూడా లాభం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also:BitCoin: ఎలోన్ మస్క్ దెబ్బకి.. బిచ్చగాళ్లుగా మారిన బిట్ కాయిన్ ఇన్వెస్టర్లు
పిఎం కిసాన్ యోజన కింద రైతు కుటుంబాలకు నగదు బదిలీ ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. దీనితో 85 మిలియన్లకు పైగా (సుమారు 8.5 కోట్లు) కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది. మహమ్మారి సమయంలో అధిక సంఖ్యలో కుటుంబాలు ఈ పథకం నుండి ప్రయోజనం పొందాయి. అయితే ఆదాయ ప్రొఫైల్, భూమి హోల్డింగ్ ఆధారంగా మినహాయింపు ప్రమాణాలు సంఖ్యను తగ్గించాయి.
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!