PM Internship Scheme: ‘పీఎం ఇంటర్న్షిప్’ పథకం నేటి నుంచి ప్రారంభం.. దరఖాస్తుతో ఈ ప్రయోజనాలు
- 'పీఎం ఇంటర్న్షిప్' పథకం నేటి నుంచి ప్రారంభం
- ఇందుకోసం పోర్టల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Internship Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్లో పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం పోర్టల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇంటర్న్ కోసం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 నుండి ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే 5 సంవత్సరాలలో, దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవ్వబడతాయి. ఇంటర్న్షిప్ అలవెన్స్ ప్రతి నెలా రూ.5,000.. ఏకమొత్తంలో రూ.6,000 ఇవ్వబడుతుంది. ఉపాధి అవకాశాల కోసం 12 నెలల అనుభవం అందుబాటులో ఉంటుంది. కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఫండ్ నుండి శిక్షణ ఖర్చు, ఇంటర్న్షిప్ ఖర్చులో 10 శాతం భరిస్తాయి.
‘అమృత్’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
10 వేల కోట్లతో పరిశుభ్రతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులలో మిషన్ అమృత్, అమృత్ 2.0 కూడా ఉన్నాయి. దీని కింద దేశంలోని అనేక నగరాల్లో నీరు, వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
Read Also: Kangana Ranaut: మళ్లీ నోరుజారిన కంగన.. గాంధీ జయంతి నాడు చేసిన పోస్ట్పై వివాదం
స్వచ్ఛ భారత్ మిషన్పై ప్రధాని మోడీ
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కోట్లాది మంది దేశప్రజల అచంచలమైన నిబద్ధతకు స్వచ్ఛ్ భారత్ మిషన్ యాత్ర ప్రతీక అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన సామూహిక ఉద్యమంగా అభివర్ణిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రయాణంలో ప్రతి ప్రయత్నం ‘పరిశుభ్రత శ్రేయస్సు’ మంత్రాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. గత పదేళ్లుగా, భారతీయులు ఈ మిషన్ను స్వీకరించారని, తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారన్నారు. పదేళ్ల ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన ప్రతి ఒక్కరిని, సఫాయి మిత్రలు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహచరులను ప్రధాని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి కృషి స్వచ్ఛ భారత్ మిషన్ను భారీ ప్రజా ఉద్యమంగా మార్చిందని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి కూడా పరిశుభ్రత సేవలో తమ వంతు సహకారం అందించారని, దేశానికి గొప్ప స్ఫూర్తిని అందించారన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కూడా సర్క్యులర్ ఎకానమీకి కొత్త ఊపునిచ్చింది.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..