PM Modi : సోలార్ ప్యానెళ్ల పథకం కింద కోటి కుటుంబాలు నమోదు : ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi : సోలార్ ప్యానెళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రణాళికను రూపొందించింది. దీని పేరు ‘పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకం. ఈ పథకం కింద కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీని వల్ల రానున్న రోజుల్లో ప్రజలకు అనేక సౌకర్యాలు అందుతాయి. దేశంలో ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకానికి దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకాన్ని ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించింది. యూపీలోని ఘజియాబాద్లోని కక్రా గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి, విద్యుత్ కొరతను అధిగమించడానికి రూపొందించబడింది. దీని కింద కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ అందించాలని నిర్ణయించారు. ఈ పథకంతో దేశంలోని పేద ప్రజలు విద్యుత్తును పొందగలుగుతారు. భారతదేశం కూడా ఇంధన రంగంలో స్వావలంబనగా మారుతుంది.
Read Also:Mudragada Padmanabham: ముద్రగడ హాట్ కామెంట్స్.. సినిమాలు, రాజకీయలు ఏవీ వదలకుండా..!
Also Read
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను షేర్ చేశారు. దీనిలో ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ ప్రారంభించిన నెల రోజుల్లోనే కోటి కుటుంబాలు పథకం కోసం నమోదు చేసుకున్నాయని పీఎం చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇంకా నమోదు చేసుకోని వారు కూడా వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని ప్రధాని కోరారు. ఈ చొరవ ఇంధన ఉత్పత్తికి హామీ ఇస్తుందని, అలాగే గృహాలకు విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. అంతే కాకుండా దీని నుంచి ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ను విక్రయించడం ద్వారా ఏటా దాదాపు 17 నుంచి 18 వేల రూపాయల ఆదాయం పొందవచ్చు. ఈ పథకం కింద 2026 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
Read Also:Group-1 Exam: అలర్ట్.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈరోజే ఆఖరు..
ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్లో కూడా సహాయపడుతుంది. పథకం పొందుతున్న వ్యక్తుల వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలకు మించకూడదు. ఇందుకోసం ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, కరెంటు బిల్లు, మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో డాక్యుమెంట్లు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ అధ్యక్షతన ఓ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులు సంవత్సరానికి రూ.18,000 వరకు ఆదా చేసుకోగలరు. పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కింద దేశంలోని కోటి మంది పేద కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే యోచనలో ఉంది. ఇందుకోసం రూ.75,021 కోట్లకు ఆమోదం తెలిపింది.
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!