kejriwal: గుజరాత్లో కేజ్రీవాల్ పర్యటన.. వాటర్ బాటిల్తో వ్యక్తి దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kejriwal: రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మూడో రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పంజాబులతో పాటు గుజరాత్ రాష్ట్రంలో ఎలాగైనా గెలిచి తీరాలని ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో అక్కడ మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పాగా వేసేందుకు కేజ్రీవాల్ తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ప్రతి నెలలో ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువసార్లు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అక్కడి గ్రామీణ ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనేక హామీల వర్షం కురిపిస్తున్నారు.
Reas also: Gandhi Jayanti: జాతిపిత గాంధీకి భారతావని ఘన నివాళి
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
ఈ క్రమంలో గుజరాత్ పర్యటనకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి నీళ్ల బాటిల్తో దాడికి యత్నించాడు. కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి విసిరిన వాటర్ బాటిల్ ఆయనను దాటుకుని వెళ్లిపడింది. అయితే, ఈ విషయాన్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. వేదికపై ఉన్న కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. అయితే, అది ఆయనను దాటుకుని వెళ్లి పడింది. కేజ్రీవాల్ వైపుగా దూసుకొస్తున్న వాటర్ బాటిల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్లో కేజ్రీవాల్ ఇస్తున్న హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాము అధికారంలోకి వస్తే గుజరాత్లోని 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించి ఉచితంగా నాణ్యమైన చికిత్స అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Read also: National Games 2022: జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్ల జోరు
ఇప్పటికే గృహ విద్యుత్తు వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే గుజరాత్లోని ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లల భవిష్యత్ కోసం ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వండి అంటూ గుజరాత్ ప్రజలను కోరారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలు వీరిద్దరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారతాయి. ఇక్కడి గెలుపు, ఓటములు జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!