Delhi: త్వరలో కేబినెట్ ముందుకు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నివేదిక
- త్వరలో కేబినెట్ ముందుకు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నివేదిక
- 100 రోజుల అజెండాలో భాగంగా మంత్రివర్గం ముందుకు
- కేంద్ర న్యాయశాఖ సంసిద్ధం
- ఒకేసారి లోక్సభ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా మోడీ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే కమిటీ దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలు సేకరించి ఒక నివేదికను తయారు చేసింది. అనంతరం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిసి నివేదిక అందజేసింది. అయితే త్వరలోనే నివేదిక కేంద్ర క్యాబినెట్ ముందుకురానుంది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ సంసిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
100 రోజుల అజెండాలో భాగంగా దీన్ని సాధ్యమైనంత తొందరగా క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు తెలిపాయి. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి వంద రోజుల్లో చేపట్టే కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలని లోక్సభ ఎన్నికలకు ముందే ప్రధాని మోడీ అన్ని శాఖలకు సూచించారు. దీనికి అనుగుణంగానే న్యాయశాఖలోని శాసన విభాగం రెడీ అవుతోంది.
జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ.. ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందించింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని అందులో సిఫార్సు చేసింది. వీటితోపాటు మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటరు కార్డులను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది. మరోవైపు ఇదే అంశంపై అటు న్యాయశాఖ కూడా త్వరలోనే తన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Health Tips : పెరుగును వీటితో కలిపి అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!