Palasa Seetamma Talli Jatara: పలాస సీతమ్మ తల్లి జాతరకు పోటెత్తిన భక్తజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం .. పలాస సీతమ్మ తల్లి జాతర మహోత్సవం కనుమ పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతమ్మ తల్లి జాతర కు సొయంత్రం వేళలో భక్తులు పోటెత్తడంతో జన సంద్రంలా మారిపోయింది.
Read Also: Rishab Pant: కోలుకున్న రిషబ్ పంత్.. రోడ్డుప్రమాదం తర్వాత తొలిసారి ట్వీట్
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లా పలాసలో వేంచేసి యున్న సీతమ్మ తల్లిని పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా ఆలయ అర్చకులు ఇఫ్పిలి మల్లేశ్వర శర్మ అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించారు . ఆలయ ప్రాంగణమంతా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాజా బజంత్రీలు , సన్నాయి మేళ తాళలతో వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దూప దీప నైవేద్యాలతో దేదీప్యమానంగా పూజలు చేశారు. అమ్మవారి చల్లని దీవెనలు ఎళ్లవేళలా తమకు ఉండాలని కోరుకుంటూ పలువురు భక్తులు మొక్కులు చెల్లించారు.
పలాస – కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు,అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. సోమవారం తెల్లవారుజామునుంచే ఆలయం వద్ద భక్తులు తరలి వచ్చారు.. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయం దగ్గర జాతర నిర్వహించడంతో యాత్రికుల తాకిడితో ఆ ప్రాంతమంతా జన సంద్రంలా మారిపోయింది. పిల్లలు, పెద్దలు, పండు ముదసలిలు సైతం ఎంతో ఉత్సాహంగా జాతరలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Read Also:China Explosion : చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. రోజైనా అదుపులోకి రాని మంటలు
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!