Piaggio Electric Auto: పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 236KM రేంజ్
- పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు విడుదల
- ఏప్ ఇ-సిటీ అల్ట్రా, ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్
- ఏప్ ఈ-సిటీ అల్ట్రా భారత్ లో రూ. 3.88 లక్షల ఎక్స్-షోరూమ్ ధర
- ఏప్ ఈ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్ భారత్ లో రూ. 3.30 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీ బైకులు, స్కూటర్లు, కార్లు, ఆటోలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. తాజాగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేసింది. కంపెనీ రెండు కొత్త మోడళ్లను ఏప్ ఇ-సిటీ అల్ట్రా, ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్ను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలను కంపెనీ అనేక అద్భుతమైన ఫీచర్లతో పాటు సూపర్ రేంజ్ తో తీసుకొచ్చింది.
Also Read:India-UK Trade Deal: ఇండియా-యూకే ట్రేడ్ డీల్.. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయంటే..
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
పియాజియో ఏప్ ఇ-సిటీ అల్ట్రా
ఇది సరికొత్త ఏప్ ఈ-సిటీ అల్ట్రా ఎలక్ట్రిక్ ఆటో. ఇది 10.2 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 236 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 9.55 kW శక్తిని, 40 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 28% గ్రేడబిలిటీ, క్లైమ్ అసిస్ట్ మోడ్, 3 kW ఛార్జర్తో ఫాస్ట్-ఛార్జింగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఇంటెలిజెంట్ టెలిమాటిక్స్, లైవ్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, డిజిటల్ స్పీడోమీటర్ను కలిగి ఉంది.
Also Read:Asia Cup 2025: దుబాయ్ వేదికగా ఆసియా కప్.. ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్..
పియాజియో ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్
దీనిలో 8.0 kWh బ్యాటరీ ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 174 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. దీనిలో అమర్చిన మోటార్ 7.5 kW పవర్, 30 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 19% గ్రేడబిలిటీ ఇచ్చారు. ఏప్ ఈ-సిటీ అల్ట్రా భారత్ లో రూ. 3.88 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు. కంపెనీ కొనుగోలుదారులకు 5 సంవత్సరాల / 2,25,000 కి.మీ వారంటీని కూడా అందిస్తోంది. ఏప్ ఈ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్ భారత్ లో రూ. 3.30 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!