Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ కొరత
- విజయవాడలో పరిస్థితి మరింత ఆందోళనకరం
- పెట్రోల్ బంక్ల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాల క్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పెట్రోల్ బంక్ల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు పెట్రోల్ బంక్ల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు.
విజయవాడలో కొన్ని బంక్లలో మోటార్ సైకిళ్లకు రూ.300 వరకు మాత్రమే, ఫోర్ వీలర్లకు రూ.1500 వరకు మాత్రమే పెట్రోల్, డీజల్ పోస్తున్నట్లు సమాచారం. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతి వాటం చూపించి అధిక ధరలకు ఇంధనం అమ్ముతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం స్పందన కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Also Read
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
పెట్రోల్ బంక్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. భారీ క్యూల వల్ల రోడ్లపై రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు తెలిపిన ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఇంధన నిల్వలు మరో మూడు నుంచి నాలుగు గంటలకే సరిపోతాయని చెబుతున్నారు. దీంతో వినియోగదారుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో అన్న సందేహం ప్రజలను కలవరపెడుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత సమస్య త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజలకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!