Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంటే, భారతదేశంలో మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుంచి రూ. 28 వరకు పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన తాజా నివేదికలో హెచ్చరించింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరాకు ఆటంకం కలగడం, ముఖ్యంగా ‘హర్మూజ్ జలసంధి’ వంటి కీలక మార్గాల్లో రవాణా నిలిచిపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వం చమురు ధరలను పెంచకుండా నియంత్రించినప్పటికీ.. పెరుగుతున్న రిఫైనరీ నష్టాల దృష్ట్యా ఈ పెంపు అనివార్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగినా, భారత్లో చమురు విక్రయ సంస్థలు (OMCs) ఇప్పటివరకు వినియోగదారులపై భారం వేయలేదు. దీనివల్ల పెట్రోల్పై లీటరుకు రూ. 18, డీజిల్పై రూ. 35 వరకు నష్టం వస్తోంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే.. అంటే ఏప్రిల్ 29 తర్వాత, ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇంధన ధరలను సవరించే అవకాశం ఉందని కోటక్ ఈక్విటీస్ అంచనా వేసింది.
సాధారణంగా ఎన్నికల సమయంలో ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచడం గతంలోనూ చూశాం. ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత్ దిగుమతి చేసుకునే చమురు బిల్లు రోజుకు సుమారు $190–210 మిలియన్ల మేర అదనంగా పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర సుమారు రూ. 94.77 వద్ద, ముంబైలో రూ. 103.54 వద్ద ఉంది. ఒకవేళ కోటక్ ఈక్విటీస్ అంచనాలు నిజమైతే.. పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. ఇది రవాణా ఖర్చులను పెంచి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేలా చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?