Perni Nani: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకునే వారు.. నిజం అయితే వేలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సిందని ప్రశ్నించారు. అప్పట్లో అర్జీలు తీసుకోవటానికి విశాఖకు వెళ్లామని చెబుతున్నారు, అయితే ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం విజయవాడలో కూడా అర్జీలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాజకీయ స్ట్రాటజీ కోసం ఏమైనా చేస్తారని మండిపడ్డారు.
నోవాటెల్ హోటల్ కు ఎందుకు వెళ్లారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడతానని, అమిత్ షాను “అమిత్ భాయ్” అని పిలిచేంత సాన్నిహిత్యం ఉందని చెబుతున్న పవన్ కళ్యాణ్, నిజంగా విశాఖ ఉక్కు ప్లాంట్కి ఒక మైన్ అలాట్ చేయించవచ్చని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్ షా దగ్గర ఇంత చనువు ఉంటే ప్రజల అవసరాలను తీర్చలేరా అని ప్రశ్నించారు. 42 విభాగాల ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయించే ధైర్యం మీకుందా అని నిలదీశారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. కానీ, ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఇద్దరు ఎంపీలతో చెలరేగి పోవచ్చుకదా అన్నారు.
Also Read
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
Bigg Boss 9 : రెడీ అయిన బిగ్ బాస్ 9 హౌస్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి సామి..!
స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఒక మైన్ తెప్పించమని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రైతులకు యూరియా అందించమని కోరారు. యూరియా లేక రైతులు విలవిల్లాడుతున్నారని, గత ఐదేళ్లలో రైతులు ఇలా రోడ్డెక్కలేదని గుర్తు చేశారు. అప్పట్లో వచ్చిన ఎరువులు, విత్తనాలు టీడీపీ వాళ్లు అమ్ముకున్నారని విమర్శించారు. యూరియా కోసం మోడీ, అమిత్ షాలకు ఫోన్ చేయవచ్చుకదా అని ప్రశ్నించారు. మీటింగులలో అనవసరపు ఉపన్యాసాలు ఎవరికీ అవసరం లేదని, మీ నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కినా పట్టించుకోవడంలేదని తీవ్రంగా విమర్శించారు.
న్యూట్రలిస్ట్, లెఫ్టిస్ట్, రైటిస్ట్ అన్న మీరు ఇప్పుడు యూనివర్సలిస్ట్ అంటున్నారని ఎద్దేవా చేశారు. దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. జనసేన కార్యకర్తలను సర్దుకోవాలని చెప్పే పవన్ కళ్యాణ్, నిజంగా మీరు సర్దుకున్నారా అని ప్రశ్నించారు. మీ అన్నయ్యను ఎమ్మెల్సీ చేసి, రేపు మంత్రిని చేస్తారని ఆరోపించారు. ఎక్కడికెళ్లినా జెండాలు మోపించడం తప్ప సర్దుకోవడం మీకు రాదని దుయ్యబట్టారు. నాదెండ్ల మనోహర్, దుర్గేష్లు మంత్రి పదవులు తీసుకోకుండా సర్దుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. చివరగా, మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో ఒకసారి చర్చించుకోవాలని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!