Indra Nooyi: అమెరికాలో భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘంటనలు భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా దుండగుల చేతిలో విద్యార్థులు బలైపోతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని అమెరికాకు పంపిస్తుంటే.. కన్న తల్లిదండ్రులకు మాత్రం దు:ఖం కలిగిస్తున్నారు. ఇటీవలే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ ప్రాణాలు కోల్పోగా.. తాజాగా హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి కిడ్నాపర్ల చెరలో ఉన్నాడు. ఈ స్టూడెంట్ ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ.. భారతీయ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
అమెరికాలో వెలుగుచూస్తున్న భారతీయ, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు, అదృశ్యం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ ట్విట్టర్లో పోస్టు చేసింది.
Also Read
ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి విన్నానని.. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని.. చట్టానికి లోబడి ఉండాలని తెలిపారు. రాత్రి పూట చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని… దయచేసి అతిగా మద్యం సేవించొద్దని కోరారు. ఇవన్నీ విపత్తుకు దారితీసే అంశాలని… కుటుంబాలకు దూరంగా అమెరికాకు వచ్చిన కొత్తలో స్నేహితులు, కొత్త అలవాట్ల వంటివాటిపై జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ఇంద్రానూయీ సూచించారు.
ఇది కూడా చదవండి: Tillu Square Censor: టిల్లన్న హడావుడి చూసి ఏదో అనుకుంటే.. ఇలా షాకిచ్చారేంటి?
భారతీయ విద్యార్థులు కఠోర శ్రమ, విజయానికి చిరునామాలు అని ఆమె గుర్తుచేశారు. అదే సమయంలో కొందరు డ్రగ్స్కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని.. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తాయని తెలిపారు. అలాగే మీ వీసా స్టేటస్ గురించి తెలుసుకోవాలని సూచించారు. అలాగే పార్ట్టైం ఉద్యోగం విషయంలో కూడా దానికున్న చట్టబద్ధతను అర్థం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా విద్యాసంస్థల పట్ల కూడా అవగాహనతో ఉండాలని, స్కామ్లు, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Suresh Raina: ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్పై సురేష్ రైనా కీలక ప్రకటన!
తాజాగా అమెరికాలో చదువుతున్న హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మహ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి సలీం తెలిపారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.
For Indian students studying/planning to study in the United States of America 🇺🇸 : a very useful video message by Ms. @Indra_Noooyi, former Chairman & CEO of PepsiCo @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia @binaysrikant76 @IndianEmbassyUS @CGI_Atlanta @cgihou… pic.twitter.com/EWTrdKd4tg
— India in New York (@IndiainNewYork) March 22, 2024
తాజావార్తలు
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!