Indra Nooyi: అమెరికాలో భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘంటనలు భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా దుండగుల చేతిలో విద్యార్థులు బలైపోతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని అమెరికాకు పంపిస్తుంటే.. కన్న తల్లిదండ్రులకు మాత్రం దు:ఖం కలిగిస్తున్నారు. ఇటీవలే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ ప్రాణాలు కోల్పోగా.. తాజాగా హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి కిడ్నాపర్ల చెరలో ఉన్నాడు. ఈ స్టూడెంట్ ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ.. భారతీయ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
అమెరికాలో వెలుగుచూస్తున్న భారతీయ, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు, అదృశ్యం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ ట్విట్టర్లో పోస్టు చేసింది.
Also Read
ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి విన్నానని.. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని.. చట్టానికి లోబడి ఉండాలని తెలిపారు. రాత్రి పూట చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని… దయచేసి అతిగా మద్యం సేవించొద్దని కోరారు. ఇవన్నీ విపత్తుకు దారితీసే అంశాలని… కుటుంబాలకు దూరంగా అమెరికాకు వచ్చిన కొత్తలో స్నేహితులు, కొత్త అలవాట్ల వంటివాటిపై జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ఇంద్రానూయీ సూచించారు.
ఇది కూడా చదవండి: Tillu Square Censor: టిల్లన్న హడావుడి చూసి ఏదో అనుకుంటే.. ఇలా షాకిచ్చారేంటి?
భారతీయ విద్యార్థులు కఠోర శ్రమ, విజయానికి చిరునామాలు అని ఆమె గుర్తుచేశారు. అదే సమయంలో కొందరు డ్రగ్స్కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని.. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తాయని తెలిపారు. అలాగే మీ వీసా స్టేటస్ గురించి తెలుసుకోవాలని సూచించారు. అలాగే పార్ట్టైం ఉద్యోగం విషయంలో కూడా దానికున్న చట్టబద్ధతను అర్థం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా విద్యాసంస్థల పట్ల కూడా అవగాహనతో ఉండాలని, స్కామ్లు, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Suresh Raina: ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్పై సురేష్ రైనా కీలక ప్రకటన!
తాజాగా అమెరికాలో చదువుతున్న హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మహ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి సలీం తెలిపారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.
For Indian students studying/planning to study in the United States of America 🇺🇸 : a very useful video message by Ms. @Indra_Noooyi, former Chairman & CEO of PepsiCo @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia @binaysrikant76 @IndianEmbassyUS @CGI_Atlanta @cgihou… pic.twitter.com/EWTrdKd4tg
— India in New York (@IndiainNewYork) March 22, 2024
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!