Nellore: నెల్లూరులో డబుల్ మర్డర్ కలకలం.. పెన్నా బ్యారేజ్లో మృతదేహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore:వాళ్లిద్దరూ గిరిజనులు.. పెన్నా నది ఒడ్డున నివసిస్తూ.. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు.. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత మార్చారు. కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈడ్చుకుంటూ తీసుకు వచ్చి సమీపంలోని పెన్నా బ్యారేజ్లో పడేశారు.. భయాందోళన కలిగించే ఈ ఘటన నెల్లూరులోని పెన్నా బ్యారేజీ సమీపంలో జరిగింది.
READ MORE: Megastar : క్లాస్ లుక్ లో మన ‘మెగాస్టార్’ చిరు లేటెస్ట్ ఫొటోస్
Also Read
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
అసలు ఏం జరిగిందంటే.. నెల్లూరులోని రంగనాయకులు పేట సమీపంలో ఉన్న పెన్నా బ్యారేజ్ వద్ద రక్తపు చారలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సంతపేట పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. రోడ్డుపైన రక్తపు చారలు ఉండడంతో.. పక్కనే ఉన్న బ్యారేజ్లో పరిశీలించారు. అందులో ఓ మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తుండగానే.. సమీపంలో మరో మృతదేహాన్ని సంతపేట పోలీసులు గుర్తించారు. డబుల్ మర్డర్ జరిగిందని తెలియడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. స్పాట్..
READ MORE: CJi Gavai vs BJP: న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. సీజేఐ దాడిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
నెల్లూరు పెన్నా బ్యారేజ్కి సమీపంలో చేపలు పట్టుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తుంటారు. అక్కడ ఉంటున్న పోలయ్యతో పాటు మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పెన్నా బ్రిడ్జి దగ్గరికి వారిద్దరిని తీసుకొచ్చి కర్రలు, రాళ్లతో మోది.. పక్కనే ఉన్న పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరినీ చంపి.. ఒకరిని పక్కనే ఉన్న పెన్నా నదిలో పడేయగా.. మరొకరిని సుమారు 100 మీటర్ల పాటు లాక్కొచ్చి పెన్నా నదిలో పడేశారు. అయితే ఈ డబుల్ మర్డర్కు కారణం ఎవరు ..? ఎందుకు చంపాల్సి వచ్చింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. డబుల్ మర్డర్ సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లా సబ్ డివిజన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాలతో.. టౌన్ డిఎస్పీతోపాటు నలుగురు CI లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
READ MORE: ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో భారత స్టార్ ప్లేయర్స్..
క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ స్పాట్కు చేరుకొని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశాయి. డాగ్ స్క్వాడ్ మర్డర్ జరిగిన సమీప ప్రాంతంలోనే తిరిగింది. దాని నుంచి ఎలాంటి క్లూ బయటికి రాకపోవడంతో.. పోలీసులు సమీపంలో ఉండే సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.. ఇంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు 25 ఏళ్లలోపు యువకులు కావడం.. చేపలు పట్టుకునే గిరిజనులు కావడంతో.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారికి ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులలో ఒకరి వివరాలు మాత్రమే పోలీసులు కనిపెట్టారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!