Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలపై వస్తున్న విమర్శలపై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నాఖ్వీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో పాకిస్థాన్ ఘోర ఓటములను చవిచూడటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లండన్లో మీడియాతో మాట్లాడిన నాఖ్వీ, జట్టును విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఏమీ సాధించని వారే ఇప్పుడు జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో కొన్ని మ్యాచ్ల్లో ఓటములు సహజమని, ఇటీవల భారత్ కూడా ఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్లో ఓడిపోయిందని గుర్తుచేశారు. ఒకట్రెండు ఓటముల ఆధారంగా జట్టు సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదన్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న జట్టులోని ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను తప్పించి వారి స్థానంలో యువకులకు అవకాశం ఇవ్వడంపై పీసీబీ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్లో పాకిస్థాన్ 0-2తో వెనుకబడి ఉంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ అత్యంత దారుణమైన స్థితిలో ఉందనడం సరికాదని నాఖ్వీ సమర్థించుకున్నారు. గతంలో వన్డే ర్యాంకింగ్స్లో 8వ స్థానంలో ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ఆడిన చివరి ఆరు వన్డే సిరీస్లలో నాలుగింటిని గెలుచుకున్నామని, జట్టు విజయావకాశాల శాతం 24 నుంచి 73 శాతానికి పెరిగిందని గణాంకాలను వివరించారు.
Also Read
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
- Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
మాజీలపై విమర్శలు..
పాకిస్థాన్ జట్టు తీరుపై షాహిద్ అఫ్రిది, మహమ్మద్ యూసుఫ్, రషీద్ లతీఫ్ వంటి మాజీ దిగ్గజాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన నాఖ్వీ, మాజీలు ఆటగాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఆపాలని కోరారు. తమ కెరీర్లో ఏమీ సాధించని వారు కూడా ఇష్టారీతిన మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఎంపిక విషయంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయని, దానికి తనదే బాధ్యతని అంగీకరించారు. జట్టును 9వ స్థానం నుంచి 1వ స్థానానికి తీసుకెళ్లడం మూడు నుంచి ఆరు నెలల్లో సాధ్యపడదని, దానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
-
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!