Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- కాక్రోచ్ పార్టీకి ఎదురు దెబ్బ..
- ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు..
- యూపీ, రాజస్థాన్ ప్రదేశాల ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్..
- పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ప్రభుత్వ పాఠశాలల్లో బయటి వ్యక్తులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ప్రతినిధులు, సివిల్ సొసైటీ కార్యకర్తల ప్రవేశంపై ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయితే, ఈ ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించేందుకు నిరాకరించింది. పాఠశాలల్లో ఫోటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్ పైన అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాలు ముందస్తు నిబంధనల్ని విధించడంపై పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ప్రియా మిశ్రా దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ రిట్ పిటిషన్ను విచారించేందుకు తాము ఆసక్తిగా లేమని ధర్మాసనం పేర్కొంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు స్కూళ్లను పరిశీలించే ముందు ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి.
Also Read
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
- El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
అయితే, ఈ ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1)(a), 19(1)(g), 21, 21-A ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ వాదించారు. ప్రజా సంస్థల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, చట్టబద్ధమైన జర్నలిజం కూడా భావ వ్యక్తీకరణలో భాగమే అని ప్రియా మిశ్రా వాదించారు. అయితే, అదే సమయంలో పిల్లల గోప్యత, గౌరవం, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి భారీ షాక్గా చెప్పొచ్చు. సీజేపీ ‘‘స్కూల్ ఠీక్ కరో’’ కార్యక్రమం పేరుతో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లను తనిఖీలు చేస్తోంది. పాఠశాలను బాగు చేయాలనే పేరుతో సీజేపీ నేతలు పాఠశాలలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు బయట వ్యక్తులు స్కూళ్లలోకి వెళ్లకుండా ప్రభుత్వ ఆదేశాలకు మద్దతు ఇచ్చింది.
తాజావార్తలు
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!