PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!
- చెన్నై సూపర్ కింగ్స్కు చెపాక్లో వరుసగా ఆరో ఓటమి
- పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం
- ముందుగా బ్యాటింగ్ చేసిన CSK 209 పరుగులు నమోదు
- శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50)తో విజయం ఖాయం
- పంజాబ్ పాయింట్స్ టేబుల్లో టాప్కు చేరుకోగా..
- చివరి స్థానానికి CSK..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS vs CSK: ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కష్టాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సొంత గడ్డపై చెన్నైకి ఇది వరుసగా ఆరో ఓటమి. దీనితో చెన్నై అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు. గత సీజన్లో ఐదు హోమ్ మ్యాచ్ లలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ ఏడాది కూడా అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ ఇంకా విజయాల ఖాతాను ఇంకా తెరవలేదు.
Saturday Horoscope: శనివారం రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందే..!
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
- Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఇక CSK vs PBKS మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఆదిలోనే చుక్కెదురైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ పవర్ప్లేలో పరుగులు తీయడానికి ఇబ్బంది పడటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే 18 ఏళ్ల యువ సంచలనం ఆయుష్ మ్హాత్రే క్రీజులోకి రావడంతో ఆట స్వరూపమే మారిపోయింది. మ్హాత్రే కేవలం 43 బంతుల్లో 73 పరుగులతో రెచ్చిపోవడంతో జట్టుకు 200+ స్కోరు అందించాడు. అతనికి తోడుగా చివరిలో శివమ్ దూబే (45), సర్ఫరాజ్ ఖాన్ (32) మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాక్ రెండు వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నైని కట్టడి చేశాడు.
ఇక భారీ బాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీనితో పంజాబ్ కేవలం 3.2 ఓవర్లలోనే 50 పరుగులతో ఫ్లయింగ్ స్టార్ట్ ను అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో సిఎస్కెపై నమోదైన వేగవంతమైన ఫిఫ్టీ ఇదే కావడం విశేషం. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 43 పరుగులు, కూపర్ కానలీ 36 పరుగులతో రాణించారు.
Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
ఇక మిడిల్ ఓవర్లలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజయాన్ని ఖాయం చేశాడు. అయ్యర్ 17వ ఓవర్లో అవుట్ అయినప్పటికీ, చివర్లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో పంజాబ్ ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లగా, చెన్నై మాత్రం వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేయుకుంది.
తాజావార్తలు
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!