Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురవుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు అత్యంత ప్రాణాంతకమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. సగటున, ప్రతి సంవత్సరం భూకంపాల కారణంగా సుమారు 560 మంది మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో నవంబర్లో సంభవించిన భూకంపం 6.3 తీవ్రత గల శక్తివంతమైనది నమోదై, కనీసం 27 మందిని బలిగొని, వందలాది ఇళ్లను ధ్వంసం చేసింది.
READ ALSO: Off The Record: బీఆర్ఎస్ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..
Also Read
- Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
- Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
- Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
భారత రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి సుమారు 9:50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు పంజాబ్లోని నోయిడా, చండీగఢ్, లుధియానా, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్తో పాటు డెహ్రాడూన్, ఇతర నగరాల్లో కూడా సంభవించాయి. చండీగఢ్లో పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “కొన్ని సెకన్ల పాటు బలమైన భూకంపం వచ్చింది” అని చెప్పారు. చాలా మంది ఈ భూకంప వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక సోషల్ మీడియా యూజర్, “ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ప్రజల ఇళ్లలోని ఫ్యాన్లు, మంచాలు కూడా వణకడం ప్రారంభించాయి” అని రాసుకొచ్చారు. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని బదఖ్షాన్ ప్రావిన్స్లో, పాకిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దుకు సమీపంలో హిందూ కుష్ ప్రాంతంలో ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్, ఇతర ప్రాంతాలతో సహా పాకిస్థాన్లోని పలు నగరాల్లో కూడా కొద్దిసేపు ప్రకంపనలు సంభవించాయని నివేదికలు తెలిపాయి.
READ ALSO: Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
తాజావార్తలు
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?