Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురవుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు అత్యంత ప్రాణాంతకమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. సగటున, ప్రతి సంవత్సరం భూకంపాల కారణంగా సుమారు 560 మంది మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో నవంబర్లో సంభవించిన భూకంపం 6.3 తీవ్రత గల శక్తివంతమైనది నమోదై, కనీసం 27 మందిని బలిగొని, వందలాది ఇళ్లను ధ్వంసం చేసింది.
READ ALSO: Off The Record: బీఆర్ఎస్ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..
Also Read
- Ashwin: "సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు".. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ 'పెసరపప్పు పాయసం' చేసేయండి ఇలా.!
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
భారత రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి సుమారు 9:50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు పంజాబ్లోని నోయిడా, చండీగఢ్, లుధియానా, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్తో పాటు డెహ్రాడూన్, ఇతర నగరాల్లో కూడా సంభవించాయి. చండీగఢ్లో పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “కొన్ని సెకన్ల పాటు బలమైన భూకంపం వచ్చింది” అని చెప్పారు. చాలా మంది ఈ భూకంప వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక సోషల్ మీడియా యూజర్, “ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ప్రజల ఇళ్లలోని ఫ్యాన్లు, మంచాలు కూడా వణకడం ప్రారంభించాయి” అని రాసుకొచ్చారు. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని బదఖ్షాన్ ప్రావిన్స్లో, పాకిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దుకు సమీపంలో హిందూ కుష్ ప్రాంతంలో ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్, ఇతర ప్రాంతాలతో సహా పాకిస్థాన్లోని పలు నగరాల్లో కూడా కొద్దిసేపు ప్రకంపనలు సంభవించాయని నివేదికలు తెలిపాయి.
READ ALSO: Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
తాజావార్తలు
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
ట్రెండింగ్
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!