Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురవుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు అత్యంత ప్రాణాంతకమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. సగటున, ప్రతి సంవత్సరం భూకంపాల కారణంగా సుమారు 560 మంది మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో నవంబర్లో సంభవించిన భూకంపం 6.3 తీవ్రత గల శక్తివంతమైనది నమోదై, కనీసం 27 మందిని బలిగొని, వందలాది ఇళ్లను ధ్వంసం చేసింది.
READ ALSO: Off The Record: బీఆర్ఎస్ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
భారత రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి సుమారు 9:50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు పంజాబ్లోని నోయిడా, చండీగఢ్, లుధియానా, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్తో పాటు డెహ్రాడూన్, ఇతర నగరాల్లో కూడా సంభవించాయి. చండీగఢ్లో పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “కొన్ని సెకన్ల పాటు బలమైన భూకంపం వచ్చింది” అని చెప్పారు. చాలా మంది ఈ భూకంప వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక సోషల్ మీడియా యూజర్, “ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ప్రజల ఇళ్లలోని ఫ్యాన్లు, మంచాలు కూడా వణకడం ప్రారంభించాయి” అని రాసుకొచ్చారు. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని బదఖ్షాన్ ప్రావిన్స్లో, పాకిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దుకు సమీపంలో హిందూ కుష్ ప్రాంతంలో ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్, ఇతర ప్రాంతాలతో సహా పాకిస్థాన్లోని పలు నగరాల్లో కూడా కొద్దిసేపు ప్రకంపనలు సంభవించాయని నివేదికలు తెలిపాయి.
READ ALSO: Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!