Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురవుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపాలు అత్యంత ప్రాణాంతకమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. సగటున, ప్రతి సంవత్సరం భూకంపాల కారణంగా సుమారు 560 మంది మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో నవంబర్లో సంభవించిన భూకంపం 6.3 తీవ్రత గల శక్తివంతమైనది నమోదై, కనీసం 27 మందిని బలిగొని, వందలాది ఇళ్లను ధ్వంసం చేసింది.
READ ALSO: Off The Record: బీఆర్ఎస్ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..
Also Read
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
భారత రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి సుమారు 9:50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు పంజాబ్లోని నోయిడా, చండీగఢ్, లుధియానా, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్తో పాటు డెహ్రాడూన్, ఇతర నగరాల్లో కూడా సంభవించాయి. చండీగఢ్లో పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “కొన్ని సెకన్ల పాటు బలమైన భూకంపం వచ్చింది” అని చెప్పారు. చాలా మంది ఈ భూకంప వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక సోషల్ మీడియా యూజర్, “ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ప్రజల ఇళ్లలోని ఫ్యాన్లు, మంచాలు కూడా వణకడం ప్రారంభించాయి” అని రాసుకొచ్చారు. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లోని బదఖ్షాన్ ప్రావిన్స్లో, పాకిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దుకు సమీపంలో హిందూ కుష్ ప్రాంతంలో ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్, ఇతర ప్రాంతాలతో సహా పాకిస్థాన్లోని పలు నగరాల్లో కూడా కొద్దిసేపు ప్రకంపనలు సంభవించాయని నివేదికలు తెలిపాయి.
READ ALSO: Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!