Pawan kalyan: రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్స్ చేస్తున్న పవన్ కల్యాణ్.. బహుశా అందుకేనేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ను సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కరోనా వల్ల అతి పెద్ద గ్యాప్ వస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలు కారణంగా షూటింగ్కు ఇంతకాలం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. గత ఏడాది నుంచి ఈ సినిమా విడుదల తేదీపై ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను 2023 సమ్మర్లో విడుదల చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలిసింది. ఇటీవల వైజాగ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్కు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్కి సంబంధించిన పని ప్రారంభించాడు. ప్రస్తుతం సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్కి ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఇది. కథకు ఇది చాలా కీలకం.
Read Also: Nidhi Agarwal: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం కడుక్కో అన్నాడు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఇక దర్శకుడు క్రిష్ అయితే పవన్ కళ్యాణ్ లేకపోయినప్పటికీ అతనితో అవసరం లేనటువంటి కొన్ని సన్నివేశాలను అయితే ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాడు. ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ నిర్ణయించున్నారట. ఇక దర్శకుడు క్రిష్ కూడా ఈసారి ప్రక్క ప్రణాళికతో ఈ స్టార్తో కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకుని షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. నిజానికి 2 రోజుల ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. సరిగ్గా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. దీంతో షూటింగ్ ను 2 రోజుల పాటు స్వచ్ఛందంగా ఆపేశారు. తాజాగా రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూట్ మొదలైంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!