Pawan Kalyan: పదవి చిన్నదా..పెద్దదా కాదు బాధ్యతే గొప్పది.. జనసేన నేతలతో డిప్యూటీ సీఎం
- అమరావతిలో జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమం నిర్వహణ
- డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతలతో విస్తృత సమావేశం
- ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వంపై కీలక వ్యాఖ్యలు
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటు
- రెల్లి సామాజికవర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ అవసరమని స్పష్టం
- పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి కూడా సముచిత అవకాశాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలో జరిగిన జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నామినేటెడ్, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ‘రెల్లి’ సామాజికవర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Beer Bottle Christmas Tree: ఇదేందయ్యా ఇది.. ఖాళీ బీర్ బాటిళ్లతో క్రిస్మస్ ట్రీ..!
Also Read
పట్టణ ప్రాంతాల వారికే కాకుండా గ్రామీణ ప్రాంతాల వారికి కూడా సముచిత అవకాశాలు కల్పించామన్నారు. “పదవి చిన్నదా పెద్దదా కాదు… బాధ్యత గొప్పది” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పదవులు ఇస్తున్నామని తెలిపారు. ఈరోజు దాదాపు 4000 మంది జనసేన నేతలు వివిధ పదవుల్లో ఉన్నారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విజయం కాదని, జనసేన భావజాలం, పోరాట పటిమకు నిదర్శనమని అన్నారు.
ఒక వ్యక్తిని గెలుపు లేదా సుఖాల్లో అంచనా వేయలేమని, ఓటమిలో ఎలా నిలబడతాడన్నదే నిజమైన కొలమానం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీ ఓడిపోయిన సమయంలో కూడా నాయకులు, కార్యకర్తలు బలంగా నిలబడ్డారని, అందుకే నేడు వారికి పదవులు దక్కాయన్నారు. పెద్ద సంఖ్యలో జనసేనకు నామినేటెడ్ పదవులు వచ్చాయని, ఇంకా కొన్ని త్వరలో రానున్నాయని తెలిపారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ అని, అందుకే ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నానన్నారు. రీజనల్ పార్టీలు సాధారణంగా ఎన్నికల కోణంలోనే ఆలోచిస్తాయని, కానీ దేశం కోసం పనిచేయాలనే తపనతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
భారత్లో Poco కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్లు.. Poco M8, M8 Proపై భారీ అంచనాలు..!
సమాజంలో సమస్యల వల్ల రక్తం మరిగిన యువతకు సరైన రాజకీయ వేదికలు లేకపోతే వారు నక్సలిజం వైపు వెళ్లే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి యువతకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే వేదికగా జనసేన ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. “రెండు మూడు కులాలే శాసిస్తాం అంటే అది కుదరదు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను కులం కోసం పార్టీ పెట్టలేదని, ఒకే కులానికే పరిమితం చేస్తే తనకు చాలా బాధ కలిగేదని చెప్పారు. జనసేన భావజాలం విస్తృతంగా పెరుగుతుందే తప్ప తగ్గేది కాదని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీని స్థాపించినప్పుడు నిర్ణయించుకున్న ఏడు సిద్ధాంతాల ప్రకారమే పార్టీ నడుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గెలుపు, ఓటములు పార్టీ బలాన్ని నిర్ణయించవని, కష్టకాలంలో పార్టీ ఎలా నిలబడుతుందన్నదే అసలైన ప్రమాణమని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!