Janasena-TDP: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు – పవన్ వరుస భేటీలు.. జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena-TDP: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆదివారం రాత్రి మళ్లీ భేటీ అయ్యారు. రెండు పార్టీల పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై విస్తృత చర్చ జరిగినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని అంటున్నారు. ఉమ్మడి సభల నిర్వహణపై రెండు దఫాల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు – పవన్ మరోసారి భేటీ కానున్నారు. అన్ని అంశాల పైనా ఎనిమిదో తేదీన జరిగే భేటీపై మరింత టీడీపీ – జనసేనలు క్లారిటీకి రానున్నాయి.
Read Also: AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ ఎప్పుడంటే?
Also Read
- Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహించడంతో జనసేన పోటీ చేయనున్న స్థానాలపై ఒక క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్ట్ను పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే అవకాశాలున్న స్థానాలు ఇవేనని ప్రచారం జరుగుతోంది. ఇంకా మరిన్ని స్థానాల్లో స్పష్టత రావాల్సి ఉంది. తర్వాత భేటీలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తెనాలి, భీమిలి, నెల్లిమర్ల లేదా గజపతి నగరం, విశాఖ నార్త్ లేక సౌత్, చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి లేదా యలమంచిలి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి. గన్నవరం, రాజానగరం, రాజమండ్రి (రూరల్) లేదా తూ.గోలో మరో సీటు, అమలాపురం, నరసాపురం. భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఏలూరు లేదా కైకలూరు, దర్శి లేదా చీరాల, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేక చిత్తూరు జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా కొన్ని స్థానాల గురించి స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!