Pawan Kalyan : పార్టీలో సమన్వయ పరుచుకునే నాయకత్వం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఏలూరు నుంచి రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో జనసేన వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఉదయం మంగళగిరి నుంచి ఏలూరు చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.. పోటీ ఒంటరిగానా ..? పొత్తు లోనా అనేది తేలడానికి చాలా సమయం ఉందని, పొత్తులు ఉంటాయో ఉండవో తేలే వరకు పార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడ వద్దని తెలిపారు. పొత్తులపై అధ్యయనం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, వైసీపీనీ ఓడించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని గతంలో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : Building Collapse: బ్రెజిల్లో కుప్పకూలిన భవనం.. ఇద్దరు చిన్నారులు సహా 14 మంది మృతి
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ఇప్పుడు అధ్యయనం చేశాకే పొత్తు లేదా ఒంటరి పోటీ తెలుస్తానన్నారు పవన్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని అవివేకం తో మాట్లాడటం లేదని, అధికారంలోకి రావాలనే ఆశ ఎవరికి ఉండదు? అందరికి ఉంటుందన్నారు. నా సందేశం కొన్ని కోట్ల మంది ప్రజల్లోకి బలంగా వెళ్తోందని, అందులో లోపం లేదన్నారు. కానీ కింది స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకునే, పోరాట పటిమ, స్ఫూర్తి ఉన్న బలమైన నాయకత్వం జనసేనకు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నా పర్యటనల తర్వాత అక్కడ పరిస్థితులపై సర్వే చేయిస్తున్నామని, మెజార్టీ పేరుతో ఏసు క్రీస్తు ను శిలువ వేశారు, సోక్రటీస్ ను అదే మెజార్టీ పేరుతో చంపేశారన్నారు. ఏపీలో రూల్ ఆఫ్ లా నాశనం అయ్యిందన్నారు పవన్. ఇదిలా ఉంటే.. మహంకాళమ్మ చల్లగా చూడాలని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా భక్తులందరికీ భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పవన్. ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలను తల్లి మహంకాళమ్మ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Mark Zuckerberg Security: మార్క్ జుకర్బర్గ్ భద్రతకు ‘మెటా’ చేసిన ఖర్చు రూ.355 కోట్లా…
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?