Pawan Kalyan: పేకాటలో క్లబ్బులు నడిపే వాళ్ళు కావాలా.. డీఎస్సీ ఇచ్చే వాళ్ళు కావాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సొంత ఇంటికి దారి వేయించుకోలేని వ్యక్తి ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే వాసు బాబు అని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. పేకాట నడపడం ద్వారా ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆరోపించారు. పేకాటలో క్లబ్బులు నడిపే వాళ్ళు కావాలా.. డీఎస్సీ ఇచ్చే వాళ్ళు కావాలా అంటూ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. స్కూల్ బుక్స్పై దేశ నాయకుల ఫోటోలో ఉంటే బాగుంటుంది.. జగన్ ఫోటో ఉంటే దరిద్రంగా ఉంటుందని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నుంచి బెయిల్ మీదున్న వ్యక్తి జగన్.. సీఎం స్థానంలో ఉండేవాడు సరైన వాడా కాదా అనేది ఆలోచించాలన్నారు. ఎవ్వరితో గొడవలు పెట్టుకోకుండా , ఎవ్వరితో అనిపించుకోకుండా సినిమాలు చేసుకోవచ్చు.. కానీ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే వాడినన్నారు.
Read Also: Botsa Satyanarayana: ఐదేళ్ల పాలన చూసి మళ్లీ గెలిపించమని అడుగుతున్నాం..
Also Read
- RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
- Sriman: "నేను పక్కా తెలుగువాడిని.. కానీ ఇక్కడ నా పేరు రిజిస్టర్ కాలేదు".. నటుడు ఆవేదన!
- Crispy Jalebi Recipe: ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్ క్రిస్పీ జలేబీ.. ఈ సింపుల్ రెసిపీతో కరకరలాడే రుచి మీ సొంతం!
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
ఆక్వా చెరువుల వల్ల ఉంగుటూరులో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. టీచర్లను జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. సీపీఎస్ రద్దు చేయకపోవడం వల్ల టీచర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ స్వార్థం లేకుండా పని చేసే జన సైనికులు ఉన్నారని.. జనసేనకి ఓటు వేస్తే వేళ్లు కత్తిరిస్తామని అంటున్నారని.. చూస్తూ వూరుకునే వాళ్ళు లేరన్నారు. అరటిపండు తిని తొక్క ముఖాన పడేశారని.. అందుకే ఇది తొక్కలో ప్రభుత్వం అయ్యిందని ఎద్దేవా చేశారు. దేవుడి భూములు చెరువులు తవ్వుకుని వచ్చిన డబ్బులు కనీసం ఆలయాలకు కట్టడం లేదని విమర్శలు గుప్పించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం జనసేన ప్రధాన లక్ష్యమని.. కొల్లేరు పరిరక్షణ కోసం జనసేన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
Read Also: CM YS Jagan: ప్రచారంలో వైసీపీ దూకుడు.. సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతున్నారు కానీ మంచి నీరు ఇవ్వడం లేదన్నారు. ఆక్వా రంగాన్ని ముంచేసిన ప్రభుత్వం వైసీపీదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు పెంచేశారు.. సబ్సిడిల్లో వచ్చే అనేక పథకాలు ఆపేసారని మండిపడ్డారు. ఆక్వా కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యాయన్నారు. పోలవరం పూర్తి అయితే తాగునీటి సమస్యలు తీరతాయన్నారు. వర్షాలు పడితే రహదారులు స్విమ్మింగ్ పూల్స్గా మారిపోతున్నాయన్నారు. జగన్కు విరామం ప్రకటించడం చాలా అవసరమని.. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్టు వైసీపీకి విరామం ప్రకటించాలన్నారు.
తాజావార్తలు
-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
-
RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్ఫ్లిక్స్లో గోల్డెన్ ఛాన్స్
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ.. ఎవరూ ఊహించని హీరో?.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
-
Sriman: “నేను పక్కా తెలుగువాడిని.. కానీ ఇక్కడ నా పేరు రిజిస్టర్ కాలేదు”.. నటుడు ఆవేదన!
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో