Site icon NTV Telugu

Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు

Pawankalyan2

Pawankalyan2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ బాధ్యతగా విభజించలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకసారి చంద్రబాబును కలిశానని.. అప్పుడు ఒకే మాట చెప్పారని.. టెంట్ వేసుకునైనా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేద్దామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. అందుకోసమే 2014లో ఎలాంటి కండీషన్స్ లేకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు చేతిలో రాష్ట్రం ఉంటే బాగుంటుందనే సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్లుగా తెలిపారు.

‘‘వాస్తవంగా చెప్పాలంటే.. భూ సమీకరణ చేయడమంటే చాలా కష్టం.. చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది రాజధాని కోసం ఎలాంటి గొడవలు లేకుండా భూములు సేకరించారు. అంతేకాకుండా భూమిలిచ్చిన వారందరికీ న్యాయం చేశారు. ఇక 2019లో ప్రభుత్వం మారినప్పుడు రాజధానిపై ఎన్ని అభండాలు వేశారో అందరికీ తెలిసిందే. గత పాలనలో మహిళా రైతులను దారుణంగా కొట్టారని.. ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్లంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. గత పాలనలో ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉండేదని.. చట్టసభల్లోనూ దాడులు జరిగేవని.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకే రక్షణ లేదు.’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

‘‘రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్‌ బాధ్యతగా వ్యవహరించలేదు. తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు అనే భావన మాకు ఎప్పుడూ లేదు. తెలుగు నేల అనే భావన ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేవు. చంద్రబాబు బలమైన ఆశావాది కాబట్టి.. ఆఫీసులు లేకపోయినా పనిచేశారు.’’ అని చెప్పారు.

ఇది కూడా చదవండి: Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు

Exit mobile version