Pawan Kalyan: పండగ పూట విషాదం.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్!
- కాకినాడ జిల్లా మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం
- ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్
- యువకుడు ఏడిద చరణ్ అక్కడికక్కడే మృతి
- స్పందించిన డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి పండగ పూట కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చరణ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Rayachoty Murder: రాయచోటిలో దారుణం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి! కారణం ఏంటంటే?
Also Read
- El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
- Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
‘మూలపేట గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడి మృతి బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వాలీబాల్ ఆడుకొనేందుకు పోల్స్ నిలబెడుతున్న సమయంలో విద్యుతాఘాతం వల్ల ఏడిద చరణ్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడని తెలిసి చింతిస్తున్నాను. చరణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడమైనది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు యువకులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశాను. క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పమని సూచించాను. క్రీడా ప్రాంగణాల్లో కావచ్చు, పని ప్రదేశాల్లో కావచ్చు.. పోల్స్ లాంటి నిలిపేటప్పుడు, ఎత్తైన ప్రదేశాల్లో నిర్మాణాల్లాంటివి చేపట్టినప్పుడు విద్యుత్ షాక్కు ఆస్కారం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ దశలోనూ అశ్రద్ధ వహించవద్దు. ప్రమాదాలు సంభవిస్తే కుటుంబ సభ్యులకు ఎంతో వేదన కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
-
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
-
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
-
Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!