Patna crime: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యం.. రణరంగంగా పాట్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి ఓ ప్రైవేటు పాఠశాలలో శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు, ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. నిరసనలు, ఆందోళనలతో బీహార్లోని పాట్నా రణరంగంగా మారింది.
పాట్నాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడేళ్ల చిన్నారి డ్రైనేజీలో శవమై కనిపించింది. తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి వాకబు చేసినా స్కూల్ యాజమాన్యం నుంచి మాత్రం సరైన జవాబు దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు యాజమాన్యంతో గొడవకు దిగారు. కానీ వారి నుంచి సరైన ఆన్సర్ మాత్రం లభించలేదు. అనంతరం స్కూల్ ఆవరణను మొత్తం వెతికితే డ్రైనేజీలో మృతదేహం కనిపించింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పెద్ద ఎత్తున స్కూల్కు చేరి పాఠశాలకు నిప్పుపెట్టారు.
Also Read
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ఇది కూడా చదవండి: Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు.. స్కూల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో చిన్నారి స్కూల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి గానీ.. బయటకు వెళ్లిన దృశ్యాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో స్కూల్లోనే ఏదో జరిగిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాట్నా పోలీస్ సూపరింటెండెంట్ చంద్రప్రకాశ్ తెలిపారు. తరగతి గది లోపల డ్రెయిన్లో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని.. హత్య కేసుగానే చూస్తు్న్నట్లు వెల్లడించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతుందని చంద్రప్రకాశ్ మీడియాకు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్కూల్ నుంచి చిన్నారి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. దీంతో విద్యాసంస్థకు వచ్చి వాకబు చేస్తే సరైన జవాబు దొరకలేదు. దీంతో అనుమానాలు తలెత్తాయి. బంధువలతో కలిసి వెతుకులాట ప్రారంభించగా.. స్కూల్ డ్రైనేజీలో మృతదేహం లభ్యమైంది. అసలు చిన్నారి ఎందుకు శవమైంది? స్కూల్ యాజమాన్యం ఎందుకు సరిగ్గా స్పందించలేదు. బాధ్యతగా స్కూల్ యాజమాన్యం ఎందుకు సీరియస్గా తీసుకోలేదు. అసలేం జరిగింది. ఇప్పుడు ఈ మిస్టరీ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.
#WATCH | Patna, Bihar: An angry crowd sets a school on fire after the body of a student was allegedly found on school premises. More details awaited. pic.twitter.com/6OwmDe8mjY
— ANI (@ANI) May 17, 2024
తాజావార్తలు
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!