Patanjali Foods: భారీగా లాభాలను ఆర్జించిన పతంజలి ఫుడ్స్.. లాభం ఎన్ని వందల కోట్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patanjali Foods: పతంజలి ఫుడ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ గా పిలిచే పతంజలి ఫుడ్స్ రెండో త్రైమాసిక ఫలితాల్లో మొత్తం రూ.254.5 కోట్ల లాభాలను ఆర్జించిందని కంపెనీ త్రైమాసిక ఫలితాలు స్పష్టం చేశాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పతంజలి ఫుడ్స్ లాభం రూ.112.3 కోట్లు. కంపెనీ త్రైమాసిక, అర్ధ వార్షిక ఫలితాలు ఆడిట్ చేయబడవు. సెప్టెంబర్ 30, 2023తో ముగిసే త్రైమాసికం ఆధారంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో కూడా కంపెనీ పనితీరు బాగానే ఉంది.
Read Also:Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు.. విధుల్లో ఉన్న 200 మందికి పైగా అధికారులు మిస్సింగ్..
Also Read
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
2024 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 7,821.89 కోట్లు, 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ. 15,588.98 కోట్లుగా ఉంది. 2024ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఆహారం, FMCG విభాగం ఆదాయం రూ. 2,487 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో దాని వాటా 31.80 శాతానికి చేరుకుంది. అయితే అంతకుముందు త్రైమాసికంలో ఇది 25.14 శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 27.7 శాతానికి తగ్గింది. పతంజలి ఫుడ్స్ ఎబిటా మార్జిన్ రెండో త్రైమాసికంలో 97.75 శాతం పెరిగి రూ.419.20 కోట్లకు చేరుకుంది. మొదటి త్రైమాసికంలో 2.71 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్ రెండో త్రైమాసికంలో 5.34 శాతానికి పెరిగింది. వార్షిక ప్రాతిపదికన పోల్చినట్లయితే 2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇది 2.41 శాతంగా ఉంది.
Read Also:Stock Market Opening: ఒడిదుడుకులతో ప్రారంభమైన మార్కెట్లు.. దీపావళి కాంతి వచ్చేనా ?
పతంజలి ఫుడ్స్ ధర తగ్గింపు
ముడిసరుకు ధరల్లో 23 శాతానికి పైగా క్షీణత ఆధారంగా పతంజలి ఫుడ్స్ మొత్తం ఖర్చులు 10 శాతంపైగా తగ్గి రూ.7511 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ ధరలు పడిపోవడంతో పతంజలి ఫుడ్స్ ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!