Patanjali Foods: పతంజలి ఫుడ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ గా పిలిచే పతంజలి ఫుడ్స్ రెండో త్రైమాసిక ఫలితాల్లో మొత్తం రూ.254.5 కోట్ల లాభాలను ఆర్జించిందని కంపెనీ త్రైమాసిక ఫలితాలు స్పష్టం చేశాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పతంజలి ఫుడ్స్ లాభం రూ.112.3 కోట్లు. కంపెనీ త్రైమాసిక, అర్ధ వార్షిక ఫలితాలు ఆడిట్ చేయబడవు. సెప్టెంబర్ 30, 2023తో ముగిసే త్రైమాసికం ఆధారంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో కూడా కంపెనీ పనితీరు బాగానే ఉంది.
Read Also:Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు.. విధుల్లో ఉన్న 200 మందికి పైగా అధికారులు మిస్సింగ్..
2024 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 7,821.89 కోట్లు, 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ. 15,588.98 కోట్లుగా ఉంది. 2024ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఆహారం, FMCG విభాగం ఆదాయం రూ. 2,487 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో దాని వాటా 31.80 శాతానికి చేరుకుంది. అయితే అంతకుముందు త్రైమాసికంలో ఇది 25.14 శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 27.7 శాతానికి తగ్గింది. పతంజలి ఫుడ్స్ ఎబిటా మార్జిన్ రెండో త్రైమాసికంలో 97.75 శాతం పెరిగి రూ.419.20 కోట్లకు చేరుకుంది. మొదటి త్రైమాసికంలో 2.71 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్ రెండో త్రైమాసికంలో 5.34 శాతానికి పెరిగింది. వార్షిక ప్రాతిపదికన పోల్చినట్లయితే 2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇది 2.41 శాతంగా ఉంది.
Read Also:Stock Market Opening: ఒడిదుడుకులతో ప్రారంభమైన మార్కెట్లు.. దీపావళి కాంతి వచ్చేనా ?
పతంజలి ఫుడ్స్ ధర తగ్గింపు
ముడిసరుకు ధరల్లో 23 శాతానికి పైగా క్షీణత ఆధారంగా పతంజలి ఫుడ్స్ మొత్తం ఖర్చులు 10 శాతంపైగా తగ్గి రూ.7511 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ ధరలు పడిపోవడంతో పతంజలి ఫుడ్స్ ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.