Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ మరియు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. చెన్నైలో జరిగిన ఒక సినీ అవార్డు ఈవెంట్లో ర్యాపిడ్ ఫైర్ సెషన్ సందర్భంగా త్రిష ఫోటో స్క్రీన్పై కనిపించిన సమయంలో ప్రేక్షకులు “కుందవై” అని కామెంట్స్ చేశారు. దానికి స్పందిస్తూ పార్థిబన్ సరదాగా వ్యాఖ్యానిస్తూ “కుందవై కొంచెం ఇంట్లోనే ఉండాలి, అప్పుడు సమస్యలు ఉండవు” అనే మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే త్రిష, పార్తీబన్ మధ్య వివాదానికి కారణం అయ్యాయి.
Also Read : Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ఈ వ్యాఖ్యలపై నటి త్రిష సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ “మైక్ చేతిలో ఉండటం వల్ల ఒక వ్యాఖ్య తెలివైనదిగా మారదు. అది కేవలం అజ్ఞానాన్ని పెద్దగా వినిపించే అవకాశం మాత్రమే ఇస్తుంది” అని పోస్ట్ చేయగా ఈ కామెంట్స్ నేరుగా పార్థిబన్ పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా పార్తీబన్ నుద్దేశించి చేసింది. వివాదం పెద్దదవడంతో పార్థిబన్ వెంటనే స్పందించారు. తాను చేసిన వ్యాఖ్య కేవలం సరదాగా చెప్పిన మాట మాత్రమేనని, ఎవరికీ అవమానం కలిగించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన మాటల వల్ల త్రిషకు లేదా అభిమానులకు బాధ కలిగితే క్షమించాలని కూడా ఆయన అన్నారు.
తాజాగా నటుడు పార్తీబన్ మరొక వీడియో రిలీజ్ చేసారు. త్రిష తన ట్వీట్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. తాను పోస్ట్ చేసిన క్షమాపణ వీడియో త్రిష ట్వీట్ చేయడానికి ముందే రికార్డ్ చేయబడిందని మరియు ఆ సమయానికి త్రిష పోస్ట్ వచ్చిందని ఆయన అన్నారు.ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు పార్థిబన్ వ్యాఖ్యను సరదాగా తీసుకోవాలని అంటుంటే, మరికొందరు సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!