Site icon NTV Telugu

Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..

Partiban Trisha

Partiban Trisha

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ మరియు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. చెన్నైలో జరిగిన ఒక సినీ అవార్డు ఈవెంట్‌లో ర్యాపిడ్ ఫైర్ సెషన్ సందర్భంగా త్రిష ఫోటో స్క్రీన్‌పై కనిపించిన సమయంలో ప్రేక్షకులు “కుందవై” అని కామెంట్స్ చేశారు. దానికి స్పందిస్తూ పార్థిబన్ సరదాగా వ్యాఖ్యానిస్తూ “కుందవై కొంచెం ఇంట్లోనే ఉండాలి, అప్పుడు సమస్యలు ఉండవు” అనే  మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే త్రిష, పార్తీబన్ మధ్య వివాదానికి కారణం అయ్యాయి.

Also Read : Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ

ఈ వ్యాఖ్యలపై నటి త్రిష సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తూ “మైక్ చేతిలో ఉండటం వల్ల ఒక వ్యాఖ్య తెలివైనదిగా మారదు. అది కేవలం అజ్ఞానాన్ని పెద్దగా వినిపించే అవకాశం మాత్రమే ఇస్తుంది” అని పోస్ట్ చేయగా ఈ కామెంట్స్ నేరుగా పార్థిబన్ పేరు ప్రస్తావించకపోయినా  పరోక్షంగా పార్తీబన్ నుద్దేశించి చేసింది. వివాదం పెద్దదవడంతో పార్థిబన్ వెంటనే స్పందించారు. తాను చేసిన వ్యాఖ్య కేవలం సరదాగా చెప్పిన మాట మాత్రమేనని, ఎవరికీ అవమానం కలిగించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన మాటల వల్ల త్రిషకు లేదా అభిమానులకు బాధ కలిగితే క్షమించాలని కూడా ఆయన అన్నారు.

తాజాగా నటుడు పార్తీబన్ మరొక వీడియో రిలీజ్ చేసారు. త్రిష తన ట్వీట్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. తాను పోస్ట్ చేసిన క్షమాపణ వీడియో త్రిష ట్వీట్ చేయడానికి ముందే రికార్డ్ చేయబడిందని మరియు ఆ సమయానికి త్రిష పోస్ట్ వచ్చిందని ఆయన అన్నారు.ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు పార్థిబన్ వ్యాఖ్యను సరదాగా తీసుకోవాలని అంటుంటే, మరికొందరు సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version