Parliament Monsoon Session : జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్
- జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- అదే రోజు మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్
- జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్ను జూలై 22న లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం 3.0 బడ్జెట్ను సమర్పించవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మోడీ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి ఆర్థిక మంత్రి అయ్యారు.
Read Also: Litchi Fruit Benefits : లీచి పండ్లను ఇలా తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
జూలై 22న ఆమె వరుసగా 7వ బడ్జెట్ను.. ఆరవ పూర్తి బడ్జెట్ను సమర్పించవచ్చు. దీనికి ముందు జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం కానుంది. ఈ సెషన్లో మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు వచ్చి పూర్తి బడ్జెట్ను అందులోనే సమర్పించవచ్చు. స్పీకర్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్నేసింది. దగ్గుబాటి పురందేశ్వరి పేరు ముందుంది. రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పురంధేశ్వరి విజయం సాధించారు.
Read Also:Kangana Ranaut: ఈ రాజకీయం కంటే ఆ పని చేయటమే నయం.. నటి సంచలనం
జూన్ 26న స్పీకర్ ఎన్నిక
జూన్ 26న మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ సెషన్ జూలై 3తో ముగుస్తుంది. తొలి సెషన్లో మొత్తం 8 సమావేశాలు జరగనున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కార్యాచరణ రూపురేఖలను ఆమె ప్రదర్శించనున్నారు. జూలై 3న ఆర్థిక సర్వే సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై 22న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో జూన్ 27 నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ తన మంత్రి మండలి సభ్యులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!