Paris Olympics 2024: ముగిసిన పారిస్ ఒలింపిక్స్.. 40 స్వర్ణాలతో టాప్లో అమెరికా! భారత్ స్థానం ఎంతంటే
- ముగిసిన పారిస్ ఒలింపిక్స్
- టాప్లో అమెరికా
- 71వ స్థానంకు పడిపోయిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won 6 Meals in Paris Olympics 2024: పారిస్ వేదికగా గత 19 రోజులుగా అలరించిన ఒలింపిక్స్ ముగిశాయి. ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్ ముగింపు వేడుకలు సైతం ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ముగిశాయి. జులై 26న విశ్వ క్రీడలు ప్రారంభం కాగా.. ఆగష్టు 11న క్లోజ్ అయ్యాయి. సెన్ నది వేదికగా ఒలింపిక్స్ వేడుకలకు బీజం పడగా.. స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో సమాప్తమయ్యాయి. నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. భారత్ తరఫున షూటర్ మను బాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ పతకధారులుగా వ్యవహరించారు. 2028 ఒలింపిక్స్ పోటీలు లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలతో టాప్లో నిలిచింది. చివరి రోజు చైనాను వెనక్కి నెట్టిన యూఎస్.. పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఒలింపిక్స్ చివరి పోటీలు అయిన మహిళ బాస్కెట్బాల్లో అమెరికా జట్టు స్వర్ణ పతకాన్ని గెలిచి తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. 40 స్వర్ణ పతకాలు సహా మొత్తంగా 126 పతకాలను యూఎస్ సాధించింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
డ్రాగన్ దేశం చైనా 40 స్వర్ణాలు పాటు మొత్తం 91 పతకాలను తన ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలిచింది. జపాన్ 20 బంగారు పతకాలతో మూడు స్థానంలో నిలిచాయి. గత టోక్యో ఒలింపిక్స్లో 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి 71వ స్థానంకు పడిపోయింది. మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనగా.. ఆరు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!