molestation case: కనుమరుగవుతున్న కుటుంబబంధాలు.. కూతుళ్లపై తండ్రుల లైంగికదాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
molestation case: ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. సాంకేతిక అభివృద్ధితో ప్రపంచం దూసుకుపోతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవుడు ఇంకా అనాగరికుడిగానే మిగిలిపోయాడా అన్న సందేహం కలుగకమానదు. సంప్రదాయాలకు, కుటుంబ బంధాలకు విలువ నిచ్చే దేశంలో కొంతమంది కీచకుల వల్ల తలవంచుకుని నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మానవ బంధాలను, వావివరసలు మరిచి నీచులు ప్రవర్తిస్తున్నారు. కన్న కూతుర్లను, తోటి సోదరులను చెరుస్తూ సమాజంలో చీడపురుగులుగా చెలరేగిపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడైన తండ్రి కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. మక్సూద్ హుస్సేన్ అనే వ్యక్తి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఏడాది కాలంగా భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు. వారికి కలిగిన బాలిక కొన్నాళ్లుగా ముభావంగా ఉంటోంది. అనుమానం వచ్చిన తల్లి బాలికను ప్రశ్నించింది. తండ్రి హుస్సేన్ కొంతకాలంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు్న్నాడని తెలిపింది. దీంతో తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
Read also: Top Gear: తుపాకీ పట్టిన టాక్సీ డ్రైవర్!
ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ తల్లి కూడా కూతురిపై లైంగిక దాడి చేస్తున్న, తండ్రికి సహకరించింది. 2018నవంబర్ 3వ తేదీన పలమనేరుకు చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతుల కూమార్తె ఇంట్లో నిద్రిస్తోంది. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి తన కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందుకు బాలిక తల్లి సహకరించింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి డీఎస్పీ రామ్ కుమార్ కేసు నమోదు చేసి కృష్ణమూర్తి దంపతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువుకావడంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం అందించాలని కలెక్టరును ఆదేశించింది.
Read also: Kuppam Crime: అనైతిక బంధం.. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య..!
కూతురిపై కన్నేసిన తండ్రికి 20ఏళ్ల జైలు
కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి కాకినాడ పోక్సో కోర్టు 20ఏళ్లు జైలు శిక్షవిధించింది. దేవీపట్నం మండలం తున్నూరు గ్రామానికి చెందిన రాజేశ్వరరెడ్డి తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. విషయం తెల్సిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఫిబ్రవరి 16న కేసు నమోదు చేయగా కోర్టు నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్చునిచ్చింది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!