Hyderabad : పారా మౌంట్ కాలనీలో కార్డన్ సెర్చ్.. అక్రమంగా ఉంటున్న నైజీరియన్ల గుర్తింపు
- పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున భారీ కార్డన్ సెర్చ్
- అక్రమంగా నివాసం ఉంటున్న 18 మంది విదేశీయుల గుర్తింపు
- బెల్ట్ షాపులు, హుక్కా కేంద్రాలపై పోలీసులు దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad : హైదరాబాద్ నగరంలోని పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, విదేశీయుల అక్రమ నివాసాలపై ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 150 మంది పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ కాలనీని చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, హెచ్ఎన్యూ, ఏఆర్ విభాగాలకు చెందిన పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.
ఈ సెర్చ్లో నైజీరియా, ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాలకు చెందిన వలసదారులు పెద్దఎత్తున ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చాలామంది భారతదేశం వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివసిస్తూ ఇల్లీగల్ కార్యకలాపాల్లో భాగం అవుతున్నట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల్లో మొత్తం 18 మంది విదేశీయులు వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా జీవిస్తున్నట్లు గుర్తించారు. వారిని గుర్తించిన పోలీసులు త్వరలోనే డిపోర్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Gold Rates: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ఈ సోదాల సందర్భంగా డాక్యుమెంట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50కి పైగా బైకులు, 5 కార్లను పోలీసులు సీజ్ చేశారు. అంతేకాక, గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న బెల్ట్ షాపులు, హుక్కా సెంటర్లను గుర్తించి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు, గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. మద్యం అక్రమ నిల్వలు బయటపడటంతో, స్థానికంగా నడుస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై మరింత దృష్టి పెట్టనున్నారు పోలీసులు.
ఈ సందర్భంగా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ మాట్లాడుతూ, “పారా మౌంట్ కాలనీలో కార్డన్ సెర్చ్తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించాం. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండిపోయిన విదేశీయులను గుర్తించాం. వారి వివరాలు సేకరించి, త్వరలోనే డిపోర్ట్ చేయనున్నాం. మాదకద్రవ్యాల విషయంలో మేము చాలా సీరియస్గా ఉన్నాం. ఈ సెర్చ్లో డ్రగ్స్ లభించలేదు. కానీ భవిష్యత్లో ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ కార్డన్ సెర్చ్తో నగరంలోని ఇతర అనుమానస్పద ప్రాంతాల్లో కూడా ఇలాంటి తనిఖీలు జరపనున్నట్లు పోలీసులు సంకేతాలు ఇస్తున్నారు. విదేశీయుల పేరుతో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ఇది ఒక ముందడుగుగా మారింది.
Kadapa Municipal: నేడు కడప కార్పొరేషన్ సమావేశం.. భారీ బందోబస్తు ఏర్పాటు! కుర్చీ గోలకు పుల్స్టాప్
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!