Junaid Jaffer: క్రికెట్ ఆడుతూ పాకిస్థాన్కు చెందిన ప్లేయర్ మృతి..
- పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్ జునైద్ జాఫర్
- మండే ఎండలో 40 ఓవర్లు ఫీల్డింగ్
- అనంతరం కుప్పకూలిన జాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ మ్యాచ్ ఆడుతూ పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్ మరణించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో జరిగింది. మరణించిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ వయస్సు 40 సంవత్సరాలు పైబడి ఉంది. జునైద్ క్లబ్ స్థాయి ఆటగాడు. అతను మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. ఉష్ణోగ్రత 41.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. ఈ మండే ఎండలో జునైద్ దాదాపు 40 ఓవర్లు ఫీల్డింగ్ చేశాడు. కానీ.. మ్యాచ్ జరుగుతుండగానే, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతని ఆరోగ్యం క్షీణించింది. స్పృహ తప్పి మైదానంలో కుప్పకూలాడు. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. జునైద్ 2013లో టెక్ రంగంలో పనిచేయడానికి పాకిస్థాన్ నుంచి అడిలైడ్కు వచ్చాడు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.
READ MORE: Payal Shankar: బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైంది..
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
జునైద్ ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్ తరపున ఆ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ అడిలైడ్లోని కాంకోర్డియా కాలేజీలో ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్తో జరిగింది. ఈ మ్యాచ్లో జునైద్ దాదాపు 7 ఓవర్లు బ్యాటింగ్ కూడా చేశాడు. ఈ సమయంలో అతను 16 పరుగులు చేసిన తర్వాత నాటౌట్గా నిలిచాడు. డైలీ మెయిల్ ప్రకారం.. జునైద్ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్నాడు. కానీ ఇస్లామిక్ నియమాల ప్రకారం.. ఓ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లయితే నీరు త్రాగడానికి అనుమతి ఉంటుంది. అందుకే జునైద్ నీరు మాత్రమే తాగినట్లు తెలిసింది. జునైద్ క్రికెట్ క్లబ్ విచారం వ్యక్తం చేస్తూ.. “మా స్టార్ సభ్యులలో ఒకరి మరణం మాకు చాలా బాధ కలిగించింది. మ్యాచ్ సమయంలో అతనికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. పారామెడిక్స్ ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయాము. అతని కుటుంబం, స్నేహితులు, బృంద సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాము.” అని పేర్కొంది.
తాజావార్తలు
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!