Pakistan: ఇరాన్కు పాక్ వెన్నుపోటు? అమెరికా చేతిలో ‘కీలుబొమ్మ’గా మారిన ఇస్లామాబాద్.. తెరపైకి సంచలన నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనుక అసలు కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మిత్రదేశంగా ఇరాన్ను ఒప్పించినట్లు కనిపిస్తున్న పాకిస్థాన్, నిజానికి అమెరికా చెప్పినట్లే ఆడిందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పాక్ కేవలం అగ్రరాజ్యం ఆదేశాలను అమలు చేసే ఒక ‘మధ్యవర్తి’గా మాత్రమే వ్యవహరించిందని, ఇది ఇరాన్కు చేసిన ద్రోహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు రండి
Also Read
అమెరికా స్క్రిప్ట్.. పాక్ యాక్షన్..
ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ కాల్పుల విరమణ వెనుక మూడు కీలక అంశాలు ఉన్నాయి.
చివరి నిమిషంలో వ్యూహం: ఏప్రిల్ 7న ఇరాన్పై దాడి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, వైట్ హౌస్ అధికారులు మాత్రం యుద్ధం కంటే చర్చలే మేలని భావించారు. ఇందుకోసం ఇరాన్కు పొరుగు దేశమైన పాకిస్థాన్ను ఒక ఆయుధంగా వాడుకున్నారు. నిజానికి ఈ యుద్ధంలో టెహ్రాన్ పాకిస్థాన్పై ఒక్క దాడి కూడా చేయలేదు. అలాగే పాకిస్థాన్ ఇరాన్కు పొరుగు దేశం. అందుకే అమెరికాకు పాక్ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
వైట్ హౌస్ కనుసన్నల్లో పాక్ ప్రధాని పోస్ట్: పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా స్వతంత్రంగా చేసింది కాదని సమాచారం. ఆ పోస్ట్ యొక్క డ్రాఫ్ట్ను కూడా వైట్ హౌస్ ఆమోదించిన తర్వాతే ఆయన పంచుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
చైనాను రంగంలోకి దించడం: అమెరికా ప్రతిపాదనను ఇరాన్ మొదట తిరస్కరించడంతో, ఇస్లామాబాద్ వెంటనే చైనా సహాయం కోరింది. బీజింగ్ జోక్యంతోనే ఇరాన్ చివరకు ఈ కాల్పుల విరమణకు తలొగ్గిందని అంటున్నారు.
ఇస్లామాబాద్లో చారిత్రాత్మక భేటీ..
శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగనున్న ఈ శాంతి సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ వేదిక వెనుక అమెరికాకు రెండు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచడం ఒకటి అయితే, పశ్చిమ ఆసియా రాజకీయాల్లో పాకిస్థాన్కు ప్రాధాన్యత కల్పించి, దానిని తన వైపు తిప్పుకోవడం రెండో లక్ష్యాలుగా చెబుతున్నారు.
ఈ పరిణామాలపై ఇరాన్ అధికారికంగా పాకిస్థాన్ను నిందించనప్పటికీ, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. “అమెరికా కాల్పుల విరమణ హామీలను ఎలా ఉల్లంఘిస్తోందో ప్రపంచం చూస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ హామీ ఇచ్చినట్లుగా లెబనాన్పై దాడులు ఆగకపోవడంతో, పాక్ మాటలను ఇరాన్ నమ్మడం లేదని స్పష్టమవుతోంది. మొత్తానికి ఇరాన్తో ఉన్న స్నేహ బంధం కంటే అమెరికా ప్రయోజనాలకే పాకిస్థాన్ పెద్దపీట వేసిందన్న చర్చ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది.
READ ALSO: Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!