NTV Telugu Site icon

Pakistan : పోలీసులు మొబైల్స్ పై నిఘా.. అవి చూశారో శిక్ష ఖాయం

New Project (44)

New Project (44)

Pakistan : పాకిస్తాన్ పోలీసుల పాలిట సోషల్ మీడియా శాపంగా మారింది. కారణం వారు విధి నిర్వహణలో సోషల్ మీడియాను ఉపయోగించడమే. కరాచీ పోలీసులు తమ 18 మంది పోలీసులను తొలగించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది. వారు పోలీసు ప్రోటోకాల్‌ను పాటించడం లేదని ఆరోపించారు. అసలు విషయం ఏంటంటే.. డ్యూటీ సమయంలో పోలీస్ యూనిఫాంలో డబుల్ మీనింగ్ వాయిస్ ఓవర్లు, ప్లేబ్యాక్ పాటలు, అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ ఐజీ ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు యూనిఫాంలో వీడియోలను ఏ ప్లాట్‌ఫారమ్‌లోనైనా అప్‌లోడ్ చేయవద్దని నిషేధించారు. పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also:Harassment: మేనల్లుడి వేధింపులపై ఫిర్యాదు.. యూపీ మహిళను కొట్టి, గుండు గీయించారు..!

శుక్రవారం, కరాచీ పోలీసులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 12 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం సస్పెండ్ పోలీసుల సంఖ్య 18కి చేరుకుంది. శుక్రవారం సస్పెండ్ అయిన 12 మంది పోలీసులలో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళా సిబ్బంది ఉన్నారు. అంతకుముందు గురువారం, కరాచీ పోలీస్ చీఫ్ జావేద్ ఆలం యూనిఫాంలో ఉన్న ఆరుగురు పోలీసులను వీడియోలు తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసినందుకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఆరుగురు పోలీసులలో ఇద్దరు మహిళా పోలీసులు కూడా ఉన్నారు.

Read Also:Dj Tillu : సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ.. మరో బొమ్మరిల్లు..

సింధ్ ఐజీ ఆదేశాల మేరకు చర్యలు
సింధ్ పోలీస్ ఐజీ గులాం నబీ మెమన్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కరాచీ ఏఐజీ, జోనల్ డీఐజీ, ఎస్‌ఎస్పీలను ఆదేశించారు. డ్యూటీ సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో వీడియోలను అప్‌లోడ్ చేసే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నారు. సాక్షాత్తూ డ్యూటీలో ఉండగానే సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో పోలీసు శాఖ ఇబ్బందికరంగా మారింది.