పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, అక్కడి పంజాబ్ సీఎం మరియం నవాజ్ వేదాలు వల్లించింది. పొరుగున ఉన్న వారితో ఘర్షణ పడొద్దు.. స్నేహ హస్తం అందించాలంటూ తన తండ్రి మాటలను తెలిపింది. ఇక, నేను ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు.. పంజాబీ సోదరుల నుంచి శుభాకాంక్షలు వచ్చాయన్నారు. నేను పాకిస్థానీని.. అలాగే, పంజాబీని కూడా.. భారత పంజాబీల్లానే మేం కూడా ఆ భాష మాట్లాడాలనుకుంటున్నామన్నారు. మా తాత మియాన్ షరీఫ్.. అమృత్సర్లోని జాటి ఉమ్రాకు చెందినవారు. ఒక పంజాబీ భారతీయుడు జాటీ ఉమ్రా నుంచి మట్టిని తీసుకువచ్చి నాకు ఇస్తే.. దానిని నేను మా తాత సమాధి దగ్గర ఉంచానని చెప్పుకొచ్చింది. భారత్ నుంచి కర్తార్పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి వచ్చిన సిక్కులను ఉద్దేశించి మరియం నవాజ్ కామెంట్స్ చేసింది.
Read Also: TSPSC: పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
ఇక, ఇదిలాఉంటే.. ఫిబ్రవరిలో మరియం పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టింది. పాకిస్థాన్ చరిత్రలో ఒక రాష్ట్రానికి మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. మరోవైపు, పాకిస్థాన్ లో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే వరకు ఆ దేశంతో చర్చలు ఉండవని భారత్ తేల్చి చెప్పింది. పొరుగు దేశాలతో తాము వాణిజ్య సంబంధాలను మళ్లీ కొనసాగించాలని కోరుకుంటామని.. ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.