Pakistan: దేశ ప్రథమ మహిళగా అధ్యక్షుడి కుమార్తె..! కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ మహిళగా కొత్త అధ్యక్షుడు జర్దారీ కుమార్తెను అధికారికంగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
వాస్తవానికి దేశాధ్యక్షుడి సతీమణికి మాత్రమే ప్రథమ మహిళ హోదా ఉంటుంది. కానీ జర్దారీ సతీమణి, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయమంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు. కానీ ఈసారి మాత్రం ఆ హోదాలో చిన్న కుమార్తె ఆసిఫాకు ఇవ్వాలని జర్దారీ నిర్ణయించినట్లు సదరు కథనాలు చెప్పుకొచ్చాయి.
ఈ విషయంపై అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ బలం చేకూరుస్తున్నాయి. కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని ఆమె పోస్ట్ చేశారు. దీంతో పాక్ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో ప్రకటన ఖాయమనే తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 2020లో ఆసిఫా తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి పీపీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జర్దారీ ప్రమాణస్వీకార కార్యక్రమానికీ కూడా ఆమె హాజరయ్యారు.
ఈ సంస్కృతి ఆయా దేశాల్లో కొనసాగుతోంది. అధ్యక్షుడి జీవిత భాగస్వామి చనిపోతే.. ఆ స్థానంలో కుమార్తెలు, సోదరీమణులు, లేదా మేనకోడళ్లను పెట్టుకునే విధానం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. అమెరికాలో ఈ పద్ధతి ఎప్పుట్నుంచో కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పాక్ అధ్యక్షుడు జర్దారీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!