Pakistan: దేశ ప్రథమ మహిళగా అధ్యక్షుడి కుమార్తె..! కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ మహిళగా కొత్త అధ్యక్షుడు జర్దారీ కుమార్తెను అధికారికంగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
వాస్తవానికి దేశాధ్యక్షుడి సతీమణికి మాత్రమే ప్రథమ మహిళ హోదా ఉంటుంది. కానీ జర్దారీ సతీమణి, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయమంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు. కానీ ఈసారి మాత్రం ఆ హోదాలో చిన్న కుమార్తె ఆసిఫాకు ఇవ్వాలని జర్దారీ నిర్ణయించినట్లు సదరు కథనాలు చెప్పుకొచ్చాయి.
ఈ విషయంపై అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ బలం చేకూరుస్తున్నాయి. కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని ఆమె పోస్ట్ చేశారు. దీంతో పాక్ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో ప్రకటన ఖాయమనే తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 2020లో ఆసిఫా తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి పీపీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జర్దారీ ప్రమాణస్వీకార కార్యక్రమానికీ కూడా ఆమె హాజరయ్యారు.
ఈ సంస్కృతి ఆయా దేశాల్లో కొనసాగుతోంది. అధ్యక్షుడి జీవిత భాగస్వామి చనిపోతే.. ఆ స్థానంలో కుమార్తెలు, సోదరీమణులు, లేదా మేనకోడళ్లను పెట్టుకునే విధానం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. అమెరికాలో ఈ పద్ధతి ఎప్పుట్నుంచో కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పాక్ అధ్యక్షుడు జర్దారీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!