Pakistan: దేశ ప్రథమ మహిళగా అధ్యక్షుడి కుమార్తె..! కారణమిదే!
పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ మహిళగా కొత్త అధ్యక్షుడు జర్దారీ కుమార్తెను అధికారికంగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.
Also Read
- AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
వాస్తవానికి దేశాధ్యక్షుడి సతీమణికి మాత్రమే ప్రథమ మహిళ హోదా ఉంటుంది. కానీ జర్దారీ సతీమణి, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయమంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు. కానీ ఈసారి మాత్రం ఆ హోదాలో చిన్న కుమార్తె ఆసిఫాకు ఇవ్వాలని జర్దారీ నిర్ణయించినట్లు సదరు కథనాలు చెప్పుకొచ్చాయి.
ఈ విషయంపై అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ బలం చేకూరుస్తున్నాయి. కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని ఆమె పోస్ట్ చేశారు. దీంతో పాక్ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో ప్రకటన ఖాయమనే తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 2020లో ఆసిఫా తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి పీపీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జర్దారీ ప్రమాణస్వీకార కార్యక్రమానికీ కూడా ఆమె హాజరయ్యారు.
ఈ సంస్కృతి ఆయా దేశాల్లో కొనసాగుతోంది. అధ్యక్షుడి జీవిత భాగస్వామి చనిపోతే.. ఆ స్థానంలో కుమార్తెలు, సోదరీమణులు, లేదా మేనకోడళ్లను పెట్టుకునే విధానం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. అమెరికాలో ఈ పద్ధతి ఎప్పుట్నుంచో కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పాక్ అధ్యక్షుడు జర్దారీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!