Pakistan : పాకిస్తాన్ లో ఘోరం.. సమాధి నుంచి శవాలను తీసి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : ప్రపంచంలో ఏ మూలన కూడా ఏ వయసులో ఉన్న అమ్మాయిలు సురక్షితంగా లేరనేది నగ్నసత్యం. ప్రతిరోజూ అనేక ప్రాంతాల నుండి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా పాకిస్తాన్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం విన్న మహిళలు వణికిపోతున్నారు. అసలు ఇలా కూడా చేస్తారా అని అవాక్కవుతున్నారు. పాకిస్తాన్లోని కరాచీలో పోలీసులు అలాంటి నెక్రోఫిలియాక్ని అరెస్టు చేశారు. మృతదేహాలతో కామవాంఛ తీర్చుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో అతను ఆగస్టు 8, గురువారం సాయంత్రం తన తల్లి మృతదేహాన్ని బాగ్-ఎ-కోరంగి స్మశానవాటికలో పాతిపెట్టాడని చెప్పాడు.
Read Also:Haryana : పాఠశాల బాత్రూమ్లో పదేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ప్రిన్సిపాల్
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
అదే సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆ శ్మశానవాటిక నుండి కొంతమంది వ్యక్తులు సమాధులను పాడుచేసి మృతదేహాలను తారుమారు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇలాంచి చర్యలకు పాల్పడుతుండగా పట్టుకున్న ప్రజలు అతడిని తీవ్రంగా కొట్టారు. కొంత సమయం తరువాత స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు మృతదేహం పై అత్యాచారం చేశారని ఆరోపించారు. మృతదేహాలతో ఇలాంటి పనులు చేసిన వ్యక్తి వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అరెస్టు తర్వాత, పోలీసులు అతనిని విచారించారు. అందులో అతను ఇప్పటివరకు నలుగురు మహిళల మృతదేహాలపై అత్యాచారం చేశాడని, స్మశానవాటికలో పాతిపెట్టిన మృతదేహాలను తాను చూసుకుంటానని.. రాత్రిపూట సమాధులను పాడుచేశానని చెప్పాడు. మృతదేహాలను బయటకు తీసి వాటితో కామవాంఛ తీర్చుకుంటామని చెప్పుకొచ్చాడు.
Read Also:Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కొనసాగుతున్న హైడ్రామా
ఇంటరాగేషన్లో ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరుగగా ప్రజలు తనను పట్టుకున్నారని కూడా చెప్పాడు. అత్యాచారం ఆరోపణలపై అరెస్టయిన వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఫిర్యాదు దారుడి తల్లి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సర్జన్ సుమ్మయ్య సయ్యద్ తెలిపారు. నిందితులపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 297 (స్మశానవాటికపై అతిక్రమించడం మొదలైనవి), 376 (అత్యాచారం కోసం శిక్ష), 354 (దౌర్జన్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి చేయడం, బలవంతం చేయడం) కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!