Pakistan : పాకిస్తాన్ లో ఘోరం.. సమాధి నుంచి శవాలను తీసి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : ప్రపంచంలో ఏ మూలన కూడా ఏ వయసులో ఉన్న అమ్మాయిలు సురక్షితంగా లేరనేది నగ్నసత్యం. ప్రతిరోజూ అనేక ప్రాంతాల నుండి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా పాకిస్తాన్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం విన్న మహిళలు వణికిపోతున్నారు. అసలు ఇలా కూడా చేస్తారా అని అవాక్కవుతున్నారు. పాకిస్తాన్లోని కరాచీలో పోలీసులు అలాంటి నెక్రోఫిలియాక్ని అరెస్టు చేశారు. మృతదేహాలతో కామవాంఛ తీర్చుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో అతను ఆగస్టు 8, గురువారం సాయంత్రం తన తల్లి మృతదేహాన్ని బాగ్-ఎ-కోరంగి స్మశానవాటికలో పాతిపెట్టాడని చెప్పాడు.
Read Also:Haryana : పాఠశాల బాత్రూమ్లో పదేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ప్రిన్సిపాల్
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
అదే సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆ శ్మశానవాటిక నుండి కొంతమంది వ్యక్తులు సమాధులను పాడుచేసి మృతదేహాలను తారుమారు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇలాంచి చర్యలకు పాల్పడుతుండగా పట్టుకున్న ప్రజలు అతడిని తీవ్రంగా కొట్టారు. కొంత సమయం తరువాత స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు మృతదేహం పై అత్యాచారం చేశారని ఆరోపించారు. మృతదేహాలతో ఇలాంటి పనులు చేసిన వ్యక్తి వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అరెస్టు తర్వాత, పోలీసులు అతనిని విచారించారు. అందులో అతను ఇప్పటివరకు నలుగురు మహిళల మృతదేహాలపై అత్యాచారం చేశాడని, స్మశానవాటికలో పాతిపెట్టిన మృతదేహాలను తాను చూసుకుంటానని.. రాత్రిపూట సమాధులను పాడుచేశానని చెప్పాడు. మృతదేహాలను బయటకు తీసి వాటితో కామవాంఛ తీర్చుకుంటామని చెప్పుకొచ్చాడు.
Read Also:Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కొనసాగుతున్న హైడ్రామా
ఇంటరాగేషన్లో ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరుగగా ప్రజలు తనను పట్టుకున్నారని కూడా చెప్పాడు. అత్యాచారం ఆరోపణలపై అరెస్టయిన వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఫిర్యాదు దారుడి తల్లి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సర్జన్ సుమ్మయ్య సయ్యద్ తెలిపారు. నిందితులపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 297 (స్మశానవాటికపై అతిక్రమించడం మొదలైనవి), 376 (అత్యాచారం కోసం శిక్ష), 354 (దౌర్జన్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి చేయడం, బలవంతం చేయడం) కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!