Pakistan Minister: అందరిముందు పాకిస్తాన్ మంత్రి పరువు తీసిన మహిళ యాంకర్.. వీడియో వైరల్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- పాకిస్తాన్ మంత్రి పరువు తీసిన మహిళ యాంకర్..
- తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవన్న మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Minister: నేడు ఉదయం జరిగిన “ఆపరేషన్ సింధూర్” ద్వారా భారత దేశ రక్షణ శాఖ కీలక విజయాన్ని సాధించింది. ఈ ఆపరేషన్లో భారత్, పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా మిస్సైల్స్తో దాడి నిర్వహించింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముఖ్య ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాద నిర్మూలనలో ఇది ఒక పెద్ద ముందడుగు అని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ లో సంచలనం రేగింది. భారత దాడుల నేపథ్యాన్ని తప్పుబట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుండగా, ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Read Also: Uttam Kumar Reddy: సిడబ్ల్యూసి ఛైర్మన్తో మంత్రి భేటీ.. నీటి ప్రాజెక్టులపై కీలక సమావేశం.!
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ఇందులో భాగంగా ఓ చర్చలో పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవని, తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తప్పించుకొనే ప్రయత్నం చేసారు. అయితే, ఆయన వ్యాఖ్యలను టీవీ యాంకర్ తీవ్రంగా తిరస్కరించారు. “జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్” ఘటనపై పాకిస్థాన్ స్పందించలేదని మంత్రి చెబుతుండగా.. యాంకర్ ప్రత్యుత్తరంగా ఆధారాలు చూపిస్తూ ఆయన నోరు మూయించారు. అంతేకాకుండా ఆ యాంకర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ రక్షణ మంత్రే ఇటీవలే గత మూడు దశాబ్దాలుగా తమ దేశం ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించిందని స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు.
Read Also: Indo-Pak: బార్డర్లో పాక్ ఆర్మీ విచక్షణారహిత కాల్పులు.. 15 మంది భారతీయ పౌరులు మృతి!
అలాగే, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ గురించి మాట్లాడుతూ.. 2011లో అమెరికా సైన్యం అతన్ని అబోటాబాద్ లోనే చంపిందని.. దాంతోపాటు బిన్ లాడెన్ పాకిస్థాన్లోనే దొరికాడన్న విషయం మాకు తెలిసిందే అని మహిళ యాంకర్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రత్యక్ష ప్రసారంలోనే పాకిస్థాన్ మంత్రికి చిక్కు ఎదురైంది. మినిస్టర్ మాట్లాడిన మాటలు అబద్ధాలు అని తేలడంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్ ఉగ్రవాదంపై ఆ దేశ ప్రభుత్వ వాస్తవ స్థితిని మళ్లీ ప్రపంచానికి చూపించింది. “ఆపరేషన్ సింధూర్” దాడి ప్రభావంతో పాటు, ఈ ఇంటర్వ్యూలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పాక్ను అంతర్జాతీయంగా ఇబ్బందికర స్థితిలో నిలబెట్టినట్లయింది.
Pakistani information minister Ataullah Tarar just went up on Sky News. It didn’t go as planned. Incredible work by @SkyYaldaHakim 👏 pic.twitter.com/pNKJvrjIGo
— Shubhangi Sharma (@ItsShubhangi) May 6, 2025
తాజావార్తలు
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!