Pakistan Hockey Team: నడిరోడ్డుపై పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాలో పాక్ ఆటగాళ్లకు ఘోర అవమానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Hockey Team: పాకిస్థాన్ జాతీయ క్రీడ అయిన హాకీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చాటిచెప్పేలా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని చేదు సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడుతుంటే, పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) వారిని నడిరోడ్డుపై నిలబెట్టిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్నాక మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.
READ ALSO: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ను చంపేందుకు అసిమ్ మునీర్ ప్లాన్..
Also Read
- Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
- Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ మాట్లాడుతూ.. మ్యాచ్లు ఆడాల్సిన ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో వంటగదిని శుభ్రం చేయడం, పాత్రలు కడగడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. “ఇలాంటి పరిస్థితుల్లో మా నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా ఆశించగలరు?” అని కెప్టెన్ సూటిగా ప్రశ్నించారు. సిడ్నీ విమానాశ్రయంలో సుమారు 14 గంటల పాటు జట్టు నిరీక్షించాల్సి వచ్చింది. హోటల్కు వెళ్తే.. ఫెడరేషన్ ముందుగా డబ్బులు చెల్లించకపోవడంతో బుకింగ్లు రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లు గంటల తరబడి వీధుల్లో తిరగాల్సి వచ్చింది. ఆటగాళ్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిధుల దుర్వినియోగం జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. హోటల్ వసతి, ఇతర ఖర్చుల కోసం పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు (PSB) ఏకంగా 10 మిలియన్లకు పైగా పాకిస్థానీ రూపాయలను ఫెడరేషన్కు విడుదల చేసింది. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ, ఫెడరేషన్ వాటిని సక్రమంగా వినియోగించలేదని తెలుస్తుంది. కేవలం 10 రోజులకు సరిపడా Airbnb బుకింగ్స్ మాత్రమే చేశారని, మిగిలిన 3 రోజులు ఆటగాళ్లు తక్కువ సౌకర్యాలు ఉన్న చౌక హోటళ్లకు మారాల్సి వచ్చిందని సమాచారం. చివరికి స్థానిక పాకిస్థానీ ప్రజలు ఆదుకోవడంతో ఆటగాళ్లకు నిలువ నీడ దొరికిందని చెబుతున్నారు.
మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో ఆడిన పాకిస్థాన్ జట్టు, ఆస్ట్రేలియా, జర్మనీలతో జరిగిన మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 2-3 తేడాతో పోరాడి ఓడిపోయింది. మైదానం వెలుపల జరిగిన గందరగోళం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సీరియస్ అయ్యారని సమాచారం. నిధులు ఏమయ్యాయి? ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే కోణంలో ఇప్పటికే ఆయన దర్యాప్తుకు ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. “మేము ఇక ఇలాంటి ఫెడరేషన్ కింద ఆడలేము” అని కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ హాకీ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.
READ ALSO: ICC-India: భారత్కు బిగ్ షాక్.. ఇకపై ఐసీసీ టోర్నీలు ఇండియాలో లేనట్టే?
తాజావార్తలు
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..