Pakistan Hockey Team: నడిరోడ్డుపై పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాలో పాక్ ఆటగాళ్లకు ఘోర అవమానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Hockey Team: పాకిస్థాన్ జాతీయ క్రీడ అయిన హాకీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చాటిచెప్పేలా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని చేదు సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడుతుంటే, పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) వారిని నడిరోడ్డుపై నిలబెట్టిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్నాక మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.
READ ALSO: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ను చంపేందుకు అసిమ్ మునీర్ ప్లాన్..
Also Read
- Ujjaini Mahankali Rangam: 'ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు'.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
- Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్టాప్ స్వాధీనం..!
- Women's Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్గా స్మృతి మందాన..!
- 20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ మాట్లాడుతూ.. మ్యాచ్లు ఆడాల్సిన ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో వంటగదిని శుభ్రం చేయడం, పాత్రలు కడగడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. “ఇలాంటి పరిస్థితుల్లో మా నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా ఆశించగలరు?” అని కెప్టెన్ సూటిగా ప్రశ్నించారు. సిడ్నీ విమానాశ్రయంలో సుమారు 14 గంటల పాటు జట్టు నిరీక్షించాల్సి వచ్చింది. హోటల్కు వెళ్తే.. ఫెడరేషన్ ముందుగా డబ్బులు చెల్లించకపోవడంతో బుకింగ్లు రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లు గంటల తరబడి వీధుల్లో తిరగాల్సి వచ్చింది. ఆటగాళ్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిధుల దుర్వినియోగం జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. హోటల్ వసతి, ఇతర ఖర్చుల కోసం పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు (PSB) ఏకంగా 10 మిలియన్లకు పైగా పాకిస్థానీ రూపాయలను ఫెడరేషన్కు విడుదల చేసింది. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ, ఫెడరేషన్ వాటిని సక్రమంగా వినియోగించలేదని తెలుస్తుంది. కేవలం 10 రోజులకు సరిపడా Airbnb బుకింగ్స్ మాత్రమే చేశారని, మిగిలిన 3 రోజులు ఆటగాళ్లు తక్కువ సౌకర్యాలు ఉన్న చౌక హోటళ్లకు మారాల్సి వచ్చిందని సమాచారం. చివరికి స్థానిక పాకిస్థానీ ప్రజలు ఆదుకోవడంతో ఆటగాళ్లకు నిలువ నీడ దొరికిందని చెబుతున్నారు.
మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో ఆడిన పాకిస్థాన్ జట్టు, ఆస్ట్రేలియా, జర్మనీలతో జరిగిన మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 2-3 తేడాతో పోరాడి ఓడిపోయింది. మైదానం వెలుపల జరిగిన గందరగోళం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సీరియస్ అయ్యారని సమాచారం. నిధులు ఏమయ్యాయి? ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే కోణంలో ఇప్పటికే ఆయన దర్యాప్తుకు ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. “మేము ఇక ఇలాంటి ఫెడరేషన్ కింద ఆడలేము” అని కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ హాకీ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.
READ ALSO: ICC-India: భారత్కు బిగ్ షాక్.. ఇకపై ఐసీసీ టోర్నీలు ఇండియాలో లేనట్టే?
తాజావార్తలు
-
Alias Rukmini : నాని నిర్మాతగా నితిన్ హీరోగా ‘రుక్మిణీ’ గ్లిమ్స్ రిలీజ్
-
Bihar Bankipur Bypoll Result: నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు.. బంకిపూర్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
-
Dhanush: రాజకీయాలపై ఊహాగానాల వేళ.. కుమారులతో ధనుష్ ప్రత్యేక పూజలు.. అసలేం జరుగుతోంది?
-
Ujjaini Mahankali Rangam: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు’.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
-
August Movies : ఆగస్ట్లో స్ట్రయిట్ తెలుగు సినిమాల జాతర.. హిట్టు కొట్టేదెవరు?
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!