Pakistan Hockey Team: నడిరోడ్డుపై పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాలో పాక్ ఆటగాళ్లకు ఘోర అవమానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Hockey Team: పాకిస్థాన్ జాతీయ క్రీడ అయిన హాకీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చాటిచెప్పేలా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని చేదు సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడుతుంటే, పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) వారిని నడిరోడ్డుపై నిలబెట్టిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్నాక మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.
READ ALSO: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ను చంపేందుకు అసిమ్ మునీర్ ప్లాన్..
Also Read
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ మాట్లాడుతూ.. మ్యాచ్లు ఆడాల్సిన ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో వంటగదిని శుభ్రం చేయడం, పాత్రలు కడగడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. “ఇలాంటి పరిస్థితుల్లో మా నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా ఆశించగలరు?” అని కెప్టెన్ సూటిగా ప్రశ్నించారు. సిడ్నీ విమానాశ్రయంలో సుమారు 14 గంటల పాటు జట్టు నిరీక్షించాల్సి వచ్చింది. హోటల్కు వెళ్తే.. ఫెడరేషన్ ముందుగా డబ్బులు చెల్లించకపోవడంతో బుకింగ్లు రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లు గంటల తరబడి వీధుల్లో తిరగాల్సి వచ్చింది. ఆటగాళ్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిధుల దుర్వినియోగం జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. హోటల్ వసతి, ఇతర ఖర్చుల కోసం పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు (PSB) ఏకంగా 10 మిలియన్లకు పైగా పాకిస్థానీ రూపాయలను ఫెడరేషన్కు విడుదల చేసింది. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ, ఫెడరేషన్ వాటిని సక్రమంగా వినియోగించలేదని తెలుస్తుంది. కేవలం 10 రోజులకు సరిపడా Airbnb బుకింగ్స్ మాత్రమే చేశారని, మిగిలిన 3 రోజులు ఆటగాళ్లు తక్కువ సౌకర్యాలు ఉన్న చౌక హోటళ్లకు మారాల్సి వచ్చిందని సమాచారం. చివరికి స్థానిక పాకిస్థానీ ప్రజలు ఆదుకోవడంతో ఆటగాళ్లకు నిలువ నీడ దొరికిందని చెబుతున్నారు.
మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో ఆడిన పాకిస్థాన్ జట్టు, ఆస్ట్రేలియా, జర్మనీలతో జరిగిన మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 2-3 తేడాతో పోరాడి ఓడిపోయింది. మైదానం వెలుపల జరిగిన గందరగోళం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సీరియస్ అయ్యారని సమాచారం. నిధులు ఏమయ్యాయి? ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే కోణంలో ఇప్పటికే ఆయన దర్యాప్తుకు ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. “మేము ఇక ఇలాంటి ఫెడరేషన్ కింద ఆడలేము” అని కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ హాకీ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.
READ ALSO: ICC-India: భారత్కు బిగ్ షాక్.. ఇకపై ఐసీసీ టోర్నీలు ఇండియాలో లేనట్టే?
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!