Champions Trophy 2025: పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు!
- ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
- 3 నగరాల్లో 15 మ్యాచ్లు
- ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మొత్తం 15 మ్యాచ్లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ షెడ్యూల్ను సిద్ధం చేసి ఐసీసీకి పంపగా.. బీసీసీఐ కారణంగా డేట్స్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు పెట్టుకుందట.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. పీసీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీసీసీఐ వెనక్కి తగ్గడం లేదు. ఐసీసీతో రాయబారం పంపినా బీసీసీఐ ఒప్పుకోలేదు. హైబ్రిడ్ మోడల్కు బీసీసీఐ సముఖంగా ఉంది. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ లేదా షార్జా వేదికగా నిర్వహించాలని సూచించింది. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకొనేది లేదంటూ పీసీబీ అంటున్నా.. ఒకవేళ టోర్నీ రద్దయితే ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారత్ లేకుండా.. టోర్నీ నిర్వహించినా బొక్క పడుతుంది. దీంతో ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం చేతుల్లో పెట్టాలని పీసీబీ నిర్ణయించింది. ఈమేరకు ఐసీసీ పంపిన ఈ-మెయిల్ను ప్రభుత్వానికి పీసీబీ పంపినట్లు తెలుస్తోంది.
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
Also Read: Ram Gopal Varma: డైరెక్టర్ రామ్గోపాల్ వర్మపై కేసు!
‘ఐసీసీ నుంచి మాకు మెయిల్ వచ్చింది. భారత జట్టును బీసీసీఐ ఇక్కడకు పంపించడం లేదని అందులో ఉంది. ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్కు భారత్ రాదు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వానికి పీసీబీ పంపింది. సర్కారు ఇచ్చే సూచనలు, సలహాలపైనే తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు ట్రోఫీ కోసం పీసీబీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.
తాజావార్తలు
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!