Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Fuel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం పాకిస్థాన్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు తీవ్రమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. సామాన్యులను శాంతింపజేసేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అర్ధరాత్రి సంచలన ప్రకటన చేశారు. పెట్రోల్ ధరను ఏకంగా 80 పాకిస్థానీ రూపాయలు తగ్గించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర రూ.378కి చేరుకుంది. గురువారం రోజున ప్రభుత్వం పెట్రోల్పై 43 శాతం, డీజిల్పై 55 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలిగిందని, అందుకే ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రధాని వివరించారు. అయినప్పటికీ, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పెట్రోల్ లెవీని తగ్గించి ఈ ఉపశమనం కల్పించింది. ఈ తగ్గిన ధరలు కనీసం నెల రోజుల పాటు అమలులో ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు.
READ MORE: Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
అంతేకాదు.. పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఫెడరల్ క్యాబినెట్ సభ్యులందరూ రాబోయే ఆరు నెలల పాటు తమ జీతాలు ప్రభుత్వానికి ఇవ్వాలని పేర్కొన్నారు. గతంలో రెండు నెలల పాటు జీతాలు తీసుకోవద్దని అనుకున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా దీనిని ఆరు నెలలకు పొడిగించారు. పొదుపు చర్యల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా ఇతర రాయితీలను కూడా ప్రధాని ప్రకటించారు. మోటార్ సైకిల్ వినియోగదారులకు లీటరుకు 100 రూపాయల సబ్సిడీని, సరుకు రవాణా వాహనాలకు 70 నుంచి 80 వేల రూపాయల వరకు, ప్రయాణీకుల వాహనాలకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే చిన్న రైతులకు ఎకరాకు 1,500 రూపాయల చొప్పున సహాయం ప్రకటించారు. రైల్వే ఛార్జీల విషయంలోనూ సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ఎకానమీ క్లాస్ ధరలను పెంచకూడదని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!