US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran: అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ చేసిన తాజా ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసిన్ నఖ్వీలతో కూడిన బృందం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకుని, అమెరికాతో నేరుగా చర్చలు జరపాలని ప్రతిపాదన తెచ్చింది. ఇరాన్తో సరిహద్దులు, ఆర్థిక-భద్రతా సంబంధాలు కలిగి ఉండటంతో పాటు అమెరికాకు పాత మిత్రదేశం అయినందున తాను నమ్మకమైన మధ్యవర్తిగా ఉంటానని పాకిస్థాన్ భావించింది. అయితే, టెహ్రాన్ పర్యటనలో ఇరాన్ నేతలు హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకునేది లేదని, అలాగే తమపై ఉన్న అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని పట్టుబట్టారు. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వం సైతం ఇరాన్ తన అణు కార్యక్రమాలను, ప్రాంతీయ దాడులను ఆపనంత వరకు ఎలాంటి ఒప్పందం సాధ్యం కాదని తేల్చిచెప్పడమే కాక, పాక్ మధ్యవర్తిత్వాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇరుపక్షాలు తమ పట్టు వీడకపోవడంతో జనరల్ మునీర్, నఖ్వీల సంయుక్త ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.
వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరించడం, దానికి ప్రతిగా ఇరాన్లోని బందర్ అబ్బాస్ వంటి సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయడం, ఇరాన్ కూడా డ్రోన్లు, మిసైళ్లతో బదులివ్వడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ వైఫల్యంతో పాకిస్థాన్ అంతర్జాతీయ దౌత్యంపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు పొరుగుదేశమైన ఇరాన్ను కాదనుకోలేక, ఇటు ఆర్థిక-సైనిక సాయం అందించే అమెరికాను వదులుకోలేక పాక్ ఇరకాటంలో పడింది. ఈ వైఫల్యం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య చిన్నపాటి సైనిక ఘర్షణలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా.. భారత్, చైనా, యూరప్ వంటి దేశాల చమురు సరఫరాపై పడి, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై పెద్ద దేశాలు నేరుగా చర్చలకే మొగ్గు చూపుతుండటంతో పాక్ లాంటి దేశాల పాత్ర పరిమితమని తేలిపోయింది. ప్రస్తుతానికి పూర్తిస్థాయి యుద్ధం రాకపోయినా ఘర్షణలు కొనసాగేలా ఉన్నాయి. దీంతో పాక్ తన దౌత్యాన్ని పునఃసమీక్షించుకుని వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తుండగా, రాబోయే రోజుల్లో చైనా, రష్యా వంటి దేశాలు ఈ వ్యవహారంలో తమ పాత్రను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
తాజావార్తలు
-
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
-
Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్లో డీజే బూత్నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!