US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran: అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ చేసిన తాజా ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసిన్ నఖ్వీలతో కూడిన బృందం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకుని, అమెరికాతో నేరుగా చర్చలు జరపాలని ప్రతిపాదన తెచ్చింది. ఇరాన్తో సరిహద్దులు, ఆర్థిక-భద్రతా సంబంధాలు కలిగి ఉండటంతో పాటు అమెరికాకు పాత మిత్రదేశం అయినందున తాను నమ్మకమైన మధ్యవర్తిగా ఉంటానని పాకిస్థాన్ భావించింది. అయితే, టెహ్రాన్ పర్యటనలో ఇరాన్ నేతలు హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకునేది లేదని, అలాగే తమపై ఉన్న అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని పట్టుబట్టారు. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వం సైతం ఇరాన్ తన అణు కార్యక్రమాలను, ప్రాంతీయ దాడులను ఆపనంత వరకు ఎలాంటి ఒప్పందం సాధ్యం కాదని తేల్చిచెప్పడమే కాక, పాక్ మధ్యవర్తిత్వాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇరుపక్షాలు తమ పట్టు వీడకపోవడంతో జనరల్ మునీర్, నఖ్వీల సంయుక్త ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.
వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరించడం, దానికి ప్రతిగా ఇరాన్లోని బందర్ అబ్బాస్ వంటి సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయడం, ఇరాన్ కూడా డ్రోన్లు, మిసైళ్లతో బదులివ్వడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ వైఫల్యంతో పాకిస్థాన్ అంతర్జాతీయ దౌత్యంపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు పొరుగుదేశమైన ఇరాన్ను కాదనుకోలేక, ఇటు ఆర్థిక-సైనిక సాయం అందించే అమెరికాను వదులుకోలేక పాక్ ఇరకాటంలో పడింది. ఈ వైఫల్యం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య చిన్నపాటి సైనిక ఘర్షణలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా.. భారత్, చైనా, యూరప్ వంటి దేశాల చమురు సరఫరాపై పడి, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై పెద్ద దేశాలు నేరుగా చర్చలకే మొగ్గు చూపుతుండటంతో పాక్ లాంటి దేశాల పాత్ర పరిమితమని తేలిపోయింది. ప్రస్తుతానికి పూర్తిస్థాయి యుద్ధం రాకపోయినా ఘర్షణలు కొనసాగేలా ఉన్నాయి. దీంతో పాక్ తన దౌత్యాన్ని పునఃసమీక్షించుకుని వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తుండగా, రాబోయే రోజుల్లో చైనా, రష్యా వంటి దేశాలు ఈ వ్యవహారంలో తమ పాత్రను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: 'మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను'.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
తాజావార్తలు
-
India LNG supply: ఎల్ఎన్జీ సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం.. పరిశ్రమలకు భారీ ఊరట
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
-
Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!