Pakistan: ఎన్నికల రిగ్గింగ్ ఎఫెక్ట్.. ఓ అధికారి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల (Pakistan Election) ఫలితాల సందర్భంగా జరిగిన అక్రమాలు తాజాగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫలితాలు సందర్భంగా ఇమ్రాన్ఖాన్-నవాజ్ షరీఫ్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నాయి. రిగ్గింగ్ జరుగుతుందంటూ ఆరోపించుకున్నాయి.
తాజాగా ఓ ఎన్నికల అధికారి రిగ్గింగ్పై నిజాన్ని ఒప్పుకుని పదవికి రాజీనామా చేశాడు. ఇటీవల జరిగిన పాకిస్థాన్(Pakistan) ఎన్నికల్లో రిగ్గింగ్(Poll Rigging) జరిగిందని పోలింగ్ ఆఫీసర్ ఒకరు ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, చీఫ్ జస్టిస్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అలాగే ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ అతను రాజీనామా సమర్పించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది.
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (PTI) దేశవ్యాప్త నిరసనలు ప్రారంభించింది.
రావల్పిండి మాజీ ఎన్నికల కమిషనర్ లియాఖత్ అలీ మీడియాతో మాట్లాడుతూ నేరాన్ని అంగీకరించారు. ‘ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను గెలిచేలా చేశారు. ఈ అవకతవకలకు నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. ఇందులో ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారుల ప్రమేయం ఉంది. దేశానికి వెన్నుపోటు పొడిచాను. అది నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. మేం చేసిన అన్యాయానికి మాకు శిక్ష పడాలి. ఆత్మహత్య చేసుకునేంతగా నాపై ఒత్తిడి వచ్చింది. చివరకు ఈ విషయాలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకున్నాను. ఈ నాయకుల కోసం ఎలాంటి తప్పులు చేయొద్దని అధికారులను అభ్యర్థిస్తున్నాను’ అంటూ తన పదవికి రాజీనామా చేశారు.
అయితే ఈ ఆరోపణలను పాక్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. కాగా.. పోలింగ్ అనంతరం సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు పలు సందేహాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే లియాఖత్ ఆరోపణలు వచ్చాయని తెలిపింది.
ఇదిలాఉంటే ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని పీటీఐ(PTI) నిర్ణయించింది. పాక్ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు పీటీఐ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులు 92 సీట్లు గెల్చుకున్నారు. కానీ పీఎంఎల్-ఎన్, పీపీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!