Pakistan: యూఏఈ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. గిన్నె పట్టుకుని దేశాల చుట్టూ పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ గిన్నెలు పట్టుకుని భిక్షం అడుక్కునే స్థాయికి దిగజారారు. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఏలా తయారైందంటే.. తక్కువ జీతం ఉండి, క్రెడిట్ కార్డుల ఉచ్చులో చిక్కుకున్న ఉద్యోగిలా మారింది. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ అన్నట్లుగా తయారైంది దాయాదిలా పరిస్థితి. తమ కడుపు నింపుకోవడానికే నాయా పైసా లేదు.. కానీ ప్రపంచ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ డబ్బులు వృథా చేసుకుంటుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభానికి గురైన పాకిస్థాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గట్టి దెబ్బ కొట్టింది. తాను ఇచ్చిన అప్పును వెంటనే చెల్లించాలని పాకిస్థాన్ను హెచ్చరించింది. గడువు సైతం విధించడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ దిక్కుతోచని పరిస్థితిలోకి కొట్టుమిట్టాడుతున్నారు.
READ MORE: Spirit : రొమాన్స్ మూడ్ లోకి రెబల్ స్టార్.. ‘స్పిరిట్’లో ప్రేమ ఘాటు కాస్త ఎక్కువే
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఇక చేసేంది ఏం లేక మళ్ళీ భిక్షాటన ప్రారంభించారు. యూఏఈకి చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్ల కోసం పాక్ పాలకులకు గత్యంతరం లేక ఇతర దేశాల ముందు చేయి చాచుతున్నారు. ఒకవైపు జనరల్ ఆసిమ్ మునీర్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, మధ్యవర్తిత్వం చేయడం ద్వారా చైనా, ఐఎంఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి తిరిగి రుణాలు పొందవచ్చనేది ఆయన ఎత్తుగడ. మరోవైపు ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే దేశాల చుట్టూ తిరుగుతున్నారు. సౌదీ అరేబియా వద్ద తమ దేశం ఎంత పేదరికంలో ఉందో వివరిస్తూ మొరపెట్టుకోవడంతో చివరికి వారు 3 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 3 బిలియన్ డాలర్ల సాయంతో పాకిస్థాన్.. యూఏఈకి చెల్లించాల్సిన అప్పును వచ్చే వారం తీర్చనుంది. దీనికి తోడు ఇప్పటికే సౌదీ పాకిస్థాన్కు ఇచ్చిన 5 బిలియన్ డాలర్ల రుణ గడువును సైతం పొడిగించారు. వాస్తవానికి పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 16 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని తాకలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఐఎంఎఫ్ షరతుల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నిల్వలు 18 బిలియన్ డాలర్లకు చేరాలి. ఒకవేళ సొంత నిల్వలు ఖర్చు చేస్తే ఐఎంఎఫ్ నుంచి వచ్చే రుణాలు ఆగిపోతాయి, తద్వారా చమురు, గ్యాస్ వంటి నిత్యావసరాల దిగుమతి నిలిచిపోయి దేశం అంధకారంలోకి వెళ్తుంది. అందుకే అప్పు తీర్చడానికి కూడా మరో కొత్త అప్పు చేయక తప్పని దుస్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతోంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!