Pakistan: యూఏఈ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. గిన్నె పట్టుకుని దేశాల చుట్టూ పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ గిన్నెలు పట్టుకుని భిక్షం అడుక్కునే స్థాయికి దిగజారారు. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఏలా తయారైందంటే.. తక్కువ జీతం ఉండి, క్రెడిట్ కార్డుల ఉచ్చులో చిక్కుకున్న ఉద్యోగిలా మారింది. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ అన్నట్లుగా తయారైంది దాయాదిలా పరిస్థితి. తమ కడుపు నింపుకోవడానికే నాయా పైసా లేదు.. కానీ ప్రపంచ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ డబ్బులు వృథా చేసుకుంటుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభానికి గురైన పాకిస్థాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గట్టి దెబ్బ కొట్టింది. తాను ఇచ్చిన అప్పును వెంటనే చెల్లించాలని పాకిస్థాన్ను హెచ్చరించింది. గడువు సైతం విధించడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ దిక్కుతోచని పరిస్థితిలోకి కొట్టుమిట్టాడుతున్నారు.
READ MORE: Spirit : రొమాన్స్ మూడ్ లోకి రెబల్ స్టార్.. ‘స్పిరిట్’లో ప్రేమ ఘాటు కాస్త ఎక్కువే
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఇక చేసేంది ఏం లేక మళ్ళీ భిక్షాటన ప్రారంభించారు. యూఏఈకి చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్ల కోసం పాక్ పాలకులకు గత్యంతరం లేక ఇతర దేశాల ముందు చేయి చాచుతున్నారు. ఒకవైపు జనరల్ ఆసిమ్ మునీర్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, మధ్యవర్తిత్వం చేయడం ద్వారా చైనా, ఐఎంఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి తిరిగి రుణాలు పొందవచ్చనేది ఆయన ఎత్తుగడ. మరోవైపు ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే దేశాల చుట్టూ తిరుగుతున్నారు. సౌదీ అరేబియా వద్ద తమ దేశం ఎంత పేదరికంలో ఉందో వివరిస్తూ మొరపెట్టుకోవడంతో చివరికి వారు 3 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 3 బిలియన్ డాలర్ల సాయంతో పాకిస్థాన్.. యూఏఈకి చెల్లించాల్సిన అప్పును వచ్చే వారం తీర్చనుంది. దీనికి తోడు ఇప్పటికే సౌదీ పాకిస్థాన్కు ఇచ్చిన 5 బిలియన్ డాలర్ల రుణ గడువును సైతం పొడిగించారు. వాస్తవానికి పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 16 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని తాకలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఐఎంఎఫ్ షరతుల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నిల్వలు 18 బిలియన్ డాలర్లకు చేరాలి. ఒకవేళ సొంత నిల్వలు ఖర్చు చేస్తే ఐఎంఎఫ్ నుంచి వచ్చే రుణాలు ఆగిపోతాయి, తద్వారా చమురు, గ్యాస్ వంటి నిత్యావసరాల దిగుమతి నిలిచిపోయి దేశం అంధకారంలోకి వెళ్తుంది. అందుకే అప్పు తీర్చడానికి కూడా మరో కొత్త అప్పు చేయక తప్పని దుస్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతోంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!