Pakistan: యూఏఈ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. గిన్నె పట్టుకుని దేశాల చుట్టూ పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ గిన్నెలు పట్టుకుని భిక్షం అడుక్కునే స్థాయికి దిగజారారు. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఏలా తయారైందంటే.. తక్కువ జీతం ఉండి, క్రెడిట్ కార్డుల ఉచ్చులో చిక్కుకున్న ఉద్యోగిలా మారింది. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ అన్నట్లుగా తయారైంది దాయాదిలా పరిస్థితి. తమ కడుపు నింపుకోవడానికే నాయా పైసా లేదు.. కానీ ప్రపంచ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ డబ్బులు వృథా చేసుకుంటుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభానికి గురైన పాకిస్థాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గట్టి దెబ్బ కొట్టింది. తాను ఇచ్చిన అప్పును వెంటనే చెల్లించాలని పాకిస్థాన్ను హెచ్చరించింది. గడువు సైతం విధించడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ దిక్కుతోచని పరిస్థితిలోకి కొట్టుమిట్టాడుతున్నారు.
READ MORE: Spirit : రొమాన్స్ మూడ్ లోకి రెబల్ స్టార్.. ‘స్పిరిట్’లో ప్రేమ ఘాటు కాస్త ఎక్కువే
Also Read
ఇక చేసేంది ఏం లేక మళ్ళీ భిక్షాటన ప్రారంభించారు. యూఏఈకి చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్ల కోసం పాక్ పాలకులకు గత్యంతరం లేక ఇతర దేశాల ముందు చేయి చాచుతున్నారు. ఒకవైపు జనరల్ ఆసిమ్ మునీర్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, మధ్యవర్తిత్వం చేయడం ద్వారా చైనా, ఐఎంఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి తిరిగి రుణాలు పొందవచ్చనేది ఆయన ఎత్తుగడ. మరోవైపు ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే దేశాల చుట్టూ తిరుగుతున్నారు. సౌదీ అరేబియా వద్ద తమ దేశం ఎంత పేదరికంలో ఉందో వివరిస్తూ మొరపెట్టుకోవడంతో చివరికి వారు 3 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 3 బిలియన్ డాలర్ల సాయంతో పాకిస్థాన్.. యూఏఈకి చెల్లించాల్సిన అప్పును వచ్చే వారం తీర్చనుంది. దీనికి తోడు ఇప్పటికే సౌదీ పాకిస్థాన్కు ఇచ్చిన 5 బిలియన్ డాలర్ల రుణ గడువును సైతం పొడిగించారు. వాస్తవానికి పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 16 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని తాకలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఐఎంఎఫ్ షరతుల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నిల్వలు 18 బిలియన్ డాలర్లకు చేరాలి. ఒకవేళ సొంత నిల్వలు ఖర్చు చేస్తే ఐఎంఎఫ్ నుంచి వచ్చే రుణాలు ఆగిపోతాయి, తద్వారా చమురు, గ్యాస్ వంటి నిత్యావసరాల దిగుమతి నిలిచిపోయి దేశం అంధకారంలోకి వెళ్తుంది. అందుకే అప్పు తీర్చడానికి కూడా మరో కొత్త అప్పు చేయక తప్పని దుస్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతోంది.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!