అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటిస్తున్నారు.
ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయా? త్వరలోనే రెండు దేశాలు చర్చలు చేపట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో ప్రత్యక్షం కావడమే ఉదాహరణ.